నారా లోకేష్కు చెప్తా, అందరికి పదవులు కష్టం: తలసానిపై అయ్యన్న గుర్రు
తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు టిడిపిని విమర్శించే నైతిక హక్కు లేదని, కేబినెట్ విస్తరణలో అందరికీ పదవులు ఇవ్వడం సాధ్యం కాదని మంత్రి అయ్యన్నపాత్రుడు మంగళవారం అన్నారు.
అమరావతి: తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు టిడిపిని విమర్శించే నైతిక హక్కు లేదని, కేబినెట్ విస్తరణలో అందరికీ పదవులు ఇవ్వడం సాధ్యం కాదని మంత్రి అయ్యన్నపాత్రుడు మంగళవారం అన్నారు.
అన్ని సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ విస్తరణ చేశారన్నారు. తలసాని టిడిపిని విమర్శించడం విడ్డూరమన్నారు. ఆయనకు ఆ హక్కు లేదని చెప్పారు.

సీనియర్ మంత్రిగా నారా లోకేష్కు తాను సలహాలు, సూచనలు ఇస్తానని చెప్పారు. పంచాయతీరాజ్ మంత్రిగా సంతృప్తి చెందానని చెప్పారు. ఎన్టీఆర్ కుటుంబంలోని మూడు తరాలతో పని చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. ఆర్ అండ్ బి అధికారులతో సమన్వయంగా ముందుకు వెళ్తామన్నారు.
సీఎంతో లయన్స్ క్లబ్ ప్రతినిధులు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబుతో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. మే నెలలో జరిగే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ శతవసంతాల వేడుకకు హాజరు కావాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. సీఎంను కలిసి ఆహ్వానించిన వారిలో చిరుగుపాటి వరప్రసాద్, క్లబ్ ప్రతినిధులు ఉన్నారు.












Click it and Unblock the Notifications