బాబు భజనలు, మీకు మాట్లాడే అవకాశం ఉందా..? అనిత సెటైర్లు..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ జరిగింది. టీడీపీ మహిళా నేత అనితతో నెటిజన్ చేసిన ట్వీట్ చర్చకు దారితీసింది. చంద్రబాబు నిర్మించలేదని నెటిజన్ అనగా.. జగన్ భజనలు అంటూ అనిత విరుచుకుపడ్డారు. భజనలు అంటూ ట్వీట్ల కామెంట్లతో యుద్ధం జరిగింది.
అదేంటో మేడం అంటూ నెటిజన్ ప్రశ్నించారు. అప్పుడెప్పుడో కడతానన్న పోలవరం ఇంతవరకు నిర్మించలేదన్నారు. కొంచెం గట్టగా చెప్పరాదు అని విమర్శించారు. దీనికి అనిత కూడా అదే విధంగా సమాధానం ఇచ్చారు. రెండు, మూడురోజుల్లో వైసీపీ నేతలు వచ్చి పోలవరం వారం రోజుల్లో పూర్తి చేస్తామని అంటున్నారని పేర్కొన్నారు. తక్కువ సమయంలో పూర్తి చేసిన ఘనత తమదేనని.. జగన్ భజన చేస్తారని అనిత దుమ్మెత్తిపోశారు.
₹5/- బాచ్ నేను ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి అమ్మానని ఒక పేపర్ కటింగ్ వేస్తున్నారు.
— Anitha Vangalapudi (@Anitha_TDP) July 15, 2020
OPEN CHALLENGE...ప్రభుత్వం మీది,ఆ విషయంలో నా తప్పు ఉందని ప్రూవ్ చేసి,న్యాయపరంగా ఎటువంటి చర్యలు అయినా తీసుకోండి. నేను ready, లేదంటే మీ పెంపుడు కుక్కలని కంట్రోల్ లో పెట్టండి.
దీనికి మరో నెటిజన్ స్పందించారు.. భజన బ్యాచ్ మొత్తం టీడీపీలోనే ఉన్నారు కదా అన్నారు. కొంపదీసి టీడీపీ భజన బ్యాచ్ వైసీపీకి షిప్ట్ అయ్యిందా అని సందేహాం వ్యక్తం చేశారు. జర జాగ్రత్త అన్నలు అంటే ట్యాగ్ చేశారు. వారు నిజంగా షిప్ట్ తెలంగాణ సోదరులు సపోర్ట్ చేయరని పేర్కొన్నారు. దీనికి అనిత కూడా అదేవిధంగా ట్వీట్ పెట్టారు.
Recommended Video
భజన గురించి మీరు మాట్లాడొచ్చా సోదరా అంటూ ట్వీట్ చేశారు. ఓ వీడియో కూడా ట్వీట్ చేశారు. పాదయాత్ర, మాల పేరుతో ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. భజన చేసేదీ ఎవరో అందరికీ తెలుసున్నారు. మరొకరిని అనే అవకాశం మీరు ఇస్తారా అని దుయ్యబట్టారు. ఇలా వైసీపీ అనుకూల నెటిజన్లతో టీడీపీ అనిత ట్వీట్ వార్ కొనసాగింది.