Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏం మాటలవి?: పవన్‌పై బాబు, మోడీకి డెడ్‌లైన్, సీఎం హామీతో తగ్గిన సీఎం రమేష్!

కడప: స్టీల్ ప్లాంట్ కేంద్రం కాదంటే తాము అందుకు సిద్ధమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం ఎంపీ సీఎం రమేష్ దీక్ష చేయగా, శనివారం దీక్ష విరమింపచేసిన చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం, వైసీపీ అధినేత వైయస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డారు.

కడప స్టీల్ ప్లాంట్ విషయంలో మోడీ సర్కారు ముందు మూడు మార్గాలు ఉన్నాయని, కేంద్రానికి తాము రెండు నెలల డెడ్ లైన్ విధిస్తున్నట్లు తెలిపారు. ఉక్కు పరిశ్రమ రాకుండా గాలి జనార్ధన్ రెడ్డి, వైయస్ జగన్‌లు కలిసి నాటకాలు ఆడుతున్నారన్నారు. ఉత్తరాంధ్ర ఉద్యమం తెస్తానని జనసేనాని అనడం ఏమాత్రం సరికాదన్నారు.

ఊరుకునేది లేదు.. మోడీకి హెచ్చరిక

ఊరుకునేది లేదు.. మోడీకి హెచ్చరిక

కేంద్ర ప్రభుత్వం కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రాకపోతే తామే నెలకొల్పి ప్రజల రుణం తీర్చుకుంటామని చంద్రబాబు అన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశంపై ఓ కమిటీ వేస్తామని, పోరాటాన్ని కొనసాగిస్తూ పార్లమెంటులో నిలదీస్తామని చెప్పారు. కడప ఉక్కు మా హక్కు అని, దాని నుంచి తప్పించుకోవాలనుకుంటే వీల్లేదన్నారు. పెద్దన్నపాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం, అన్యాయం జరిగినప్పుడు అక్కున చేర్చుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మోసగిస్తానంటే ఊరుకునేది లేదన్నారు.

మోడీ ముందు 3 మార్గాలు పెట్టి చంద్రబాబు సవాల్

మోడీ ముందు 3 మార్గాలు పెట్టి చంద్రబాబు సవాల్

స్టీల్ ప్లాంట్‌కు కడప కంటే అనుకూలమైన ప్రాంతం ఉంటే చూపించాలని చంద్రబాబు సవాల్ చేశారు. కేంద్రం ముందు మూడు మార్గాలు ఉన్నాయని, ఒకటి కేంద్రం స్టీల్ ప్లాంట్ పెడితే రాష్ట్రం సహకరిస్తుందని, రెండోది కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో (సగం సగం) ఏర్పాటు చేద్దామని, లేదంటే మూడో మార్గంగా మేమే పరిశ్రమ నెలకొల్పుతామన్నారు. అయితే అందుకు అనుగుణంగా ఎంఎండీఆర్ నిబంధనలు సవరించాలని, ఇందుకు రెండు నెలల సమయం ఇస్తున్నామన్నారు. కేంద్రం ముందుకు రానంటే తాము నిర్మిస్తామని చంద్రబాబు చెప్పడంతో సీఎం రమేష్ దీక్ష విరమించినట్లుగా చెబుతున్నారు.

 ఇంత జరుగుతున్నా జగన్ మాట్లాడటం లేదు

ఇంత జరుగుతున్నా జగన్ మాట్లాడటం లేదు

సొంత జిల్లాలో ఇంత జరుగుతున్నా జగన్‌ నోరు మెదపకపోవడం దారుమని చంద్రబాబు అన్నారు. అంతటితో ఆగకుండా ఆ పార్టీ నాయకులు దీక్షలను తప్పుబడుతూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కేంద్రం తిరుమల వెంకటేశ్వరుడితోను ఆటలు ఆడే ప్రయత్నాలు చేసిందన్నారు. నోటీసులు పంపి పెత్తనం చలాయించే ప్రయత్నం చేసిందని, రమణదీక్షితులుతో స్వామివారి ఆభరణాలపై విమర్శలు చేయిస్తోందని మండిపడ్డారు. తనపై తప్పుడు ప్రచారానికి వందిమాగధులను ఏర్పాటు చేసుకున్నారన్నారు.

ఏం మాటలవి?.. పవన్ పైన చంద్రబాబు

ఏం మాటలవి?.. పవన్ పైన చంద్రబాబు

ఉత్తరాంధ్ర ఉద్యమం తెస్తానని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ చెప్పడం సరికాదని చంద్రబాబు అన్నారు. విశాఖపట్నంను నేనే అభివృద్ధి చేశానని, మరోపక్క కేంద్రం రాష్ట్రం పట్ల అహంభావాన్ని ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశిస్తే తాము రాజీనామాకు కూడా సిద్ధమని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+