చంద్రబాబు వర్సెస్ జగన్: టిడిపి నేతల్లో డైలామా, వైసిపి ఎమ్మెల్యేల పక్కచూపులు
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఐదుగురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడుతున్నారని ప్రచారం జరుగుతుండగా, పదవులు లేని తెలుగుదేశం నాయకులు ఏం చేయాలో తెలియక డైలమాలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులకు, నాయకులకు గాలం వేస్తుంటే, జగన్ వారిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, శాసనసభ్యులు తమ పార్టీలోకి వస్తే తమ భవిష్యత్తు ఏమిటనే అందోళనలో తెలుగుదేశం పార్టీ నాయకులు పడినట్లు చెబుతున్నారు. దాదాపు రెండేళ్ల నుంచి ఎటువంటి పదవులు లేకుండా ఉన్న మాజీమంత్రులు కెఈ ప్రభాకర్, శిల్పా మోహన్రెడ్డి, ఎన్.ఎమ్.డి. ఫరూక్, ఇరిగెల రాంపుల్లారెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి వంటి సీనియర్ పాటు జూనియర్ నేతలు కూడా డైలమాలో పడినట్లు చెబుతున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి జిల్లాలో అసంతృప్తి సెగలు రగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
కాగా, కర్నూలు జిల్లాలో పటిష్టంగా ఉన్న తమ పార్టీని దెబ్బ తీసేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. అయితే బయట జరిగే ప్రచారానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు భుజాలు తడుముకుంటున్నారని అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు.

ఈ నెల 6వ తేదీన జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లాకు వచ్చినప్పుడు రాత్రి పత్తికొండ ప్రభుత్వ అతిథిగృహంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో రహస్యభేటి జరిపారు. జిల్లా అభివృద్ధి- పార్టీ స్థితిగతులపై ప్రధానంగా చర్చించారు. టిడిపిలోకి వచ్చే నాయకులను ఆహ్వానించాలని, ఎవరికీ అన్యాయం జరగకుండా తాను చూసుకుంటానని చంద్రబాబు అన్నట్లు చెబుతున్నారు. దాంతో కర్నూలు రాజకీయం వేడెక్కింది.
జిల్లాలో టిడిపికి ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. 2019 ఎన్నికల నాటికి 14 స్థానాల్లో టిడిపి జెండా ఎగురవేయడమే తమ లక్ష్యమని నంద్యాల బహిరంగసభలో ముఖ్యమంత్రి చెప్పారు. అందుకు అనుగుణంగా ఇతర పార్టీల నాయకులను టిడిపిలో చేర్చుకునేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు.
-
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
జగన్కు విజయమ్మ షాక్: నీ చెల్లికి, మేనల్లుడికి అన్యాయం చేశావు -
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..!











Click it and Unblock the Notifications