ఎన్డీఏకే టీడీపీ మద్దతు - అమిత్ షాతో సమావేశం : చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ముందే..!!
టీడీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. 2019లో రెండు పార్టీల అనుభవాలతో..ఈ సారి ఎన్నికలకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా ఎన్డీఏకు వైసీపీ అనధికారిక మిత్రపక్షం గా వ్యవహరిస్తున్న వేళ..టీడీపీ సైతం అదే బాట పట్టింది. ఎన్డీఏ కోరకపోయినా..వారికి మద్దతు ఇచ్చేందుకు..టీడీపీ వారితోనే ఉంటుందనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా.. టీడీపీ తమంతట తామే ముందుకొచ్చి రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు ప్రకటించింది. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ తమ వైఖరి స్పష్టం చేసింది.

మరోసారి ఎన్డీఏకే టీడీపీ మద్దతు
ఎన్డీఏ అభ్యర్ధికే తమ మద్దతు అని తేల్చి చెప్పింది. ఢిల్లీలోని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు... జగ్దీప్ ధనకర్ను కలిశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగ్దీప్ ధనకర్కు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఇప్పటికే వైసీపీ ఎంపీలు సైతం ధన్ కర్ ను కలిసి తమ మద్దతు ప్రకటించారు. అదే తరహాలో ఇప్పుడు టీడీపీకి చెందిన నలుగురు పార్లమెంట్ సభ్యులు ఆయన్ను కలిసారు. ఇదే సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ప్రహ్లాద్ జోషి నివాసంలోనే ఉన్నారు. టీడీపీ ఎంపీలు ఆయన్ను కలిసారు. తాము ధన్ కర్ కు మద్దతు ఇస్తున్నట్లు అమిత్ షా తోనూ చెప్పుకొచ్చారు.

వైసీపీకి చెక్ పెట్టే వ్యూహంలో టీడీపీ
ఇక, ఎన్డీఏకు తాము మద్దతు ఇవ్వటం ద్వారా వైసీపీ - బీజేపీ ముఖ్య నేతల మధ్య సంబంధాల పైన ప్రభావం పడేలా టీడీపీ వ్యవహరిస్తోంది. 2019 ఎన్నికల వేళ..జగన్ అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు టీడీపీ అమలు చేస్తోంది. నాడు టీడీపీ ఎన్డీఏలో కొనసాగుతూ..బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ తీసుకొనే నిర్ణయాలకు మద్దతు ఇచ్చేది. కానీ, వైసీపీ ఎన్డీఏలో నాడు - నేడు భాగస్వామి కాకపోయినా మద్దతుగానే నిలుస్తోంది. ఇప్పుడు టీడీపీ సైతం ఎన్డీఏలో భాగస్వామి కాదు. కానీ, 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు టీడీపీ భవిష్యత్ కు కీలకం. దీంతో..జగన్ కు బలం పెంచే ప్రతీ అంశం పైన టీడీపీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న వారి నుంచి మద్దతు విషయంలో ఆలోచన చేస్తోంది. బీజేపీ - టీడీపీ మధ్య గ్యాప్ తగ్గించుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

జగన్ కౌంటర్ - ప్రధాని అంగీకరిస్తారా
ఇదే సమయంలో సీఎం జగన్ సైతం అలర్ట్ అయ్యారు. ఇక, ఈ నెల 6వ తేదీన సీఎం జగన్ - టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ ఢిల్లీ వస్తున్నారు. ప్రధాని అధ్యక్షత జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నేషనల్ కమిటీ మీటింగ్లో పాల్గొనేందుకు కేంద్రం నుంచి ఆహ్వానం రావటంతో..హాజరు కానున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నిర్వహించే సమావేశానికి ఈ ఇద్దరు నేతలు హాజరవుతారని తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ద్వారా ఎన్డీఏ వైపు తొలి అడుగు వేసిన టీడీపీ..ఇప్పుడు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు - అమిత్ షా తో సమావేశం ద్వారా మరో అడుగు ముందుకేసింది. ఇక, చంద్రబాబు ఢిల్లీ పర్యటనల ద్వారా తమ వ్యూహాన్ని ఢిల్లీ కేంద్రంగా అమలు చేసేందుకు పావులు కదుపుతోంది. మరి..టీడీపీ ప్రయత్నాలను జగన్ ఏ విధంగా కౌంటర్ చేస్తారో.. కేంద్రంలోని ముఖ్య నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.
-
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్











Click it and Unblock the Notifications