దద్దరిల్లిన టీ సభ: కేసీఆర్ను ప్రశ్నించిన అక్బర్(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. స్పీకర్ మధుసూదనా చారి సభ మొదలవగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కాగా, సోమవారం సభ వాడిగావేడిగా సాగిన విషయం తెలిసిందే. సభ దద్దరిల్లింది.
రాష్ట్రంలో విద్యుత్ సమస్యకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని అధికార తెరాస అనగా, కాంగ్రెస్, టీడీపీ పార్టీలు వాటిని తీవ్రంగా కొట్టి పారేశాయి.
ఓ సమయంలో కేసీఆర్, హరీష్, ఈటెలలకు రేవంత్, ఎర్రబెల్లిలకు తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అక్బరుద్దీన్ మూడేళ్లకు కరెంట్ ఇస్తే ఏం లాభమని, ఇప్పుడు ఆత్మహత్యలు జరక్కుండా చూడాలని ప్రభుత్వానికి సూచిస్తూనే మద్దతు పలికారు. కాగా, విద్యుత్ సమస్యను తీర్చాలని కేంద్రం పైన భారం వేస్తూ సభ తీర్మానం చేసింది.
పోచారం
మంగళవారం నాడు తెలంగాణ శాసన సభలో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి దృశ్యం.
అసెంబ్లీ
తెలంగాణ శాసనసభ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. స్పీకర్ మధుసూదనా చారి సభ మొదలవగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు. సోమవారం సభ వాడిగావేడిగా సాగిన విషయం తెలిసిందే. సభ దద్దరిల్లింది.
రేవంత్ రెడ్డి
విద్యుత్ సమస్యను తీర్చలేని అసమర్థ కేసీఆర్ ప్రభుత్వం పక్క రాష్ట్రం పైన అపవాదు వేసి తప్పించుకోవాలని చూస్తోందని రేవంత్ మండిపడ్డారు. చంద్రబాబు పైన తప్పు నెట్టి కాలయాపన చేయడం ఏమిటన్నారు.
కేసీఆర్
మంగళవారం తెలంగాణ శాసన సభలో తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
మదుసూధనా చారి
తెలంగాణ శాసనసభ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. స్పీకర్ మధుసూదనా చారి సభ మొదలవగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కాగా, సోమవారం సభ వాడిగావేడిగా సాగిన విషయం తెలిసిందే. సభ దద్దరిల్లింది.
జానా రెడ్డి
విద్యుత్ సమస్యలకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలే కారణమని అధికార తెరాస పార్టీ ఆరోపించడంతో అలా అనవద్దని సీఎల్పీ నేత జానారెడ్డి సూచించారు.
లక్ష్మణ్
విద్యుత్ సమస్యపై కేంద్రం సరైన సమయంలో స్పందించలేదని తెరాస ఆరోపించడంతో.. కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాస్తే మన ప్రభుత్వమే స్పందించలేదని బీజేపీ ఎల్పీ నేత డాక్టర్ కే లక్ష్మణ్ చెప్పారు.
రేవంత్ రెడ్డి
విద్యుత్ సమస్యను తీర్చలేని అసమర్థ కేసీఆర్ ప్రభుత్వం పక్క రాష్ట్రం పైన అపవాదు వేసి తప్పించుకోవాలని చూస్తోందని రేవంత్ మండిపడ్డారు. చంద్రబాబు పైన తప్పు నెట్టి కాలయాపన చేయడం ఏమిటన్నారు.
హరీష్ రావు
తమిళనాడు - కర్నాటక రాష్ట్ర జల వివాదం సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నుండి రిక్షా కార్మికుడి వరకు అందరు తమ తమ రాష్ట్రాల కోసం పోరాడితే, తెలంగాణ టీడీపీ నేతలు మాత్రం పక్క రాష్ట్రానికి మద్దతుగా నిలబడటం దారుణమని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం సభలో అన్నారు.
అక్బర్
అక్బరుద్దీన్ మూడేళ్లకు కరెంట్ ఇస్తే ఏం లాభమని, ఇప్పుడు ఆత్మహత్యలు జరక్కుండా చూడాలని ప్రభుత్వానికి సూచిస్తూనే మద్దతు పలికారు.
పద్మా దేవేందర్ రెడ్డి
తెలంగాణ శాసనసభ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. స్పీకర్ మధుసూదనా చారి సభ మొదలవగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కాగా, సోమవారం సభ వాడిగావేడిగా సాగిన విషయం తెలిసిందే. సభ దద్దరిల్లింది.
ఎర్రబెల్లి
శాసనసభలో సోమవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
కిషన్ రెడ్డి
పలుమార్లు మంత్రులు పదే పదే అడ్డుకోవడంపై బీజేపీ సభ్యుడు కిషన్ రెడ్డి స్పందించారు. నిమిషానికోసారి మంత్రులు లేస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలు వాస్తవాన్ని గ్రహిస్తారన్నారు. ప్రతిసారి లేవడం ఏమిటన్నారు. మంత్రులకు కూడా సమయం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఎన్నిసార్లు లేచి కూర్చున్నారో చూడాలన్నారు. సీఎం సరే.. మంత్రులు కూడా లేవడం ఏమిటన్నారు.