వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చట్ట సభల్లో వాడే భాష సంస్కారవంతంగా ఉండాలి.!చంద్రబాబుకు ఎంపీ వైయస్ చౌదరి సంఘీభావం.!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు దేశ వ్యాప్తంగా సంఘీభావం పెరుగుతోంది. వ్యక్తిగత ఆరోపణలు చేయడం ముమ్మాటికీ తప్పేనంటూ, చంద్రబాబు కుటుంబం గురించి శాసన సభలో ప్రస్థావించడం ముమ్మాటికీ తప్పేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొందరు సభ్యులు విపక్ష నేతను వ్యక్తి గతంగా టార్గెట్ చేసి, ఆయన కుటుంబ సభ్యులను అసభ్యంగా మాట్లాడడం క్షమార్హం కాదని, సభా నాయకుడిగా వున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వారిని ప్రోత్సహించడం తగదని రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి హితవు పలికారు. రాజకీయాల్లో విమర్శలు విధానాలపై వుండాలి గానీ, ప్రస్తుతం వ్యక్తులను దాటకుని, కుటుంబ సభ్యుల వరకు వెళ్లడం మంచి సంప్రదాయం కాదని సుజనా చౌదరి అభిప్రాయ పడ్డారు.

The language used in the legislature should be cultured!MP YS Chaudhary solidarity with Chandrababu!

Recommended Video

Chandrababu Crying ప్రెస్ మీట్లోనే ఏడ్చేసిన చంద్రబాబు CBN Challenge In AP Assembly | Oneindia Telugu

ఏపీ శాసన సభలో సభ్యులు వ్యవహరించిన తీరు సరైన విధానం కాదని, ఏ పార్టీ వారైనా హద్దులు దాటి, అసభ్య పదజాలంతో విమర్శలు చేసుకోవడం అత్యున్నత రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామిక విలువలను పతనం చేయడమేనని సుజనా చౌదని పేర్కొన్నారు. ఉన్నత విలువలతో, సంస్కారవంతమైన భాషతో ప్రజా సమస్యలపై చర్చలకు వేదికగా నిలవాల్సిన చోట ఇలాంటి పరిణామాలు జరగడం శోచనీయమన్నారు రాజ్యసభ ఎంపీ. రాష్ట్రంలోని మేధావులు, విద్యావంతులు, వివేచన కలిగినవారంతా ఇలాంటి ఘటనలను ఖండించాలని పిలుపునిచ్చారు. వ్యక్తిత్వం లేని నేలబారు నేతలను చట్టసభలకు పంపితే పరిణామాలు ఇలానే వుంటాయని, మన పిల్లల కోసం మంచి భవిష్యత్తును ఇవ్వాలంటే దిగజారుడు నేతలను దూరం పెట్టాలని, లేదంటే భవిష్యత్తు తరాలు రాజకీయనాయకులన్నా, రాజకీయాల్లోకి రావాలన్నా అసహ్యించుకునే ప్రమాదం వుందని, కాబట్టి పార్టీలకు అతీతంగా నేతలంతా రాజకీయాల్లో విలువలను కాపాడేందుకు ప్రయత్నించాలని సుజనా చౌదరి విజ్ఞప్తి చేసారు.

English summary
Rajya Sabha member Sujana Chowdhury said that some members of the Andhra Pradesh Assembly had personally targeted the Leader of the Opposition in the past and it was unforgivable for him to speak indecently to his family members and that Chief Minister Jaganmohan Reddy, who is the Leader of the House, should not encourage such people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X