పిడుగుపాటుకి... నలుగురికి గాయాలు
గుంటూరు జిల్లా నకరికళ్ళు మండలం గుళ్లపల్లి లో పిడుగుపడి నలుగురికి గాయాలు అయ్యాయి. స్థానిక నకరికళ్ళు లో పొలం పనుల్లో ఉన్న ముగ్గురు రైతులు ఒక వ్యవసాయ కూలీ లపై పిడుగు పడి తీవ్రగాయాలు పాలయ్యారు.
గుంటూరు: గుంటూరు జిల్లా నకరికళ్ళు మండలం గుళ్లపల్లి లో పిడుగుపడి నలుగురికి గాయాలు అయ్యాయి. స్థానిక నకరికళ్ళు లో పొలం పనుల్లో ఉన్న ముగ్గురు రైతులు ఒక వ్యవసాయ కూలీ లపై పిడుగు పడి తీవ్రగాయాలు పాలయ్యారు.

మంగళవారం మధ్యాహ్నం తరువాత భోజనాలు ముగించుకుని ముగ్గురు రైతులు ఓ వ్యవసాయ కూలీ పొలం లో పని చేసుకుంటున్నారు. ఇదే సమయం లో దట్టమైన మబ్బులు పట్టింది. ఉరుములు, మెరుపులతో సన్న గా వర్షం ప్రారంభమైంది. దీనితో పొలం లో పని చేసుకుంటున్న నలుగురు స్థానికంగా ఓ చెట్టు క్రిందకు చేరారు.

అదే సమయం లో చెట్టుమీద పిడుగు పడింది. ఆ పిడుగు పాటుకి చెట్టు క్రింద ఉన్న నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. విషయం తెలుసు కున్న స్థానికులు వైద్యం కోసం వారిని గ్రామంలోకి తరలించారు. ఒళ్ళు కాలి తీవ్ర గాయాల పాలైన రైతులకు స్థానికం గా ప్రధమ చికిత్స చేసి సెలయిన్ లు ఎక్కించారు.

వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయినట్లు డాక్టర్స్ తెలిపారు. తృటిలో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. బాధితులను ప్రధమ చికిత్స అనంతరం ఇంటికి పంపించారు. అంతకు ముందు ఆసుపత్రి వద్ద బాధితులను ఏ.పీ, స్పీకర్ పరా మరహించారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications