బాణాసంచా తయారు చేస్తుండగా పేలుడు: ముగ్గురు మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు
తూర్పుగోదావరి: రాజమహేంద్రవరంలోని లాలా చెరువు ప్రాంతంలోని ఓ ఇంట్లో శనివారం తెల్లవారుజామున బాణసంచా పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
బాణసంచా తయారుచేస్తుండగా విద్యుదాఘాతం కారణంగా భారీ పేలుడు సంభవించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సుబ్బారావుపేటలోని పూరింట్లో ముత్యాలరెడ్డి కుటుంబం నివాసం ఉంటోంది. ఇతను ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. వీరి కుటుంబం ఏటా దీపావళికి బాణసంచా తయారు చేస్తుంటుంది.

ఈ సారి కూడా రాత్రి సమయంలో టపాసులు తయారు చేస్తున్నారు. విద్యుదాఘాతం కారణంగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అగ్నికీలల్లో ముత్యాలరెడ్డి కుటుంబ సభ్యులు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి వెళ్లి క్షతగాత్రుల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముత్యాల రెడ్డి భార్య సూర్యాకాంతం, కోడలు ధనలక్ష్మి మృతి చెందారు. అనంతరం కుమారుడు వినయ్రెడ్డి కూడా చనిపోయాడు. ముత్యాల రెడ్డి, అతని మేనకోడలు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమతి లేకుండా ఇలా బాణాసంచా తయారు చేసే పరిశ్రమలను మూసేయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications