విరిగి పడ్డ రైలు బోగీ: తప్పిన ప్రమాదం, ప్రయాణికుల ఆందోళన
రాజమండ్రి: స్పెషల్ ప్యాసింజర్ రైలు బోగీ విరిగి పడటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు సమీపంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గోదావరి పుష్కరాల నేపథ్యంలో విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే స్పెషల్ ప్యాసింజర్ రైలు ఉంగుటూరు సమీపంలోకి రాగానే బోగీ ఒకటి నిట్టనిలువుగా చీలి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

ఒక్కసారిగా బోగీ విరిగిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే సంఘటనా స్ధలానికి చేరుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో రైలు ప్రయాణికులు కొంత మంది బస్సులో వెళ్లిపోయారు.
ప్యాసింజర్ రైలుతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విరిగిపడిన బోగీని పక్కకు తొలగించి రైళ్ల రాకపోకలకు వీలు కల్పించారు. ఈ ఘటన కారణంగా ఆ రైలు మార్గంలో రెండు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
-
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications