పునాది లేకుండా గోడ కట్టారు.. సింహాచలం ఘటనపై త్రిసభ్య కమిషన్ సంచలన రిపోర్ట్ ?
ప్రముఖ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న సన్నిధిలో నిర్వహించిన చందనోత్సవంలో ఘోర అపశ్రుతి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. శ్రీ వరాహలక్ష్మీ శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో గోడ కూలిన ఘటనలో తొమ్మిది మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
అయితే ఈ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై త్రిసభ్య కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. తాత్కాలికంగా నిర్మించిన గోడకు పునాది కూడా లేదని కమిషన్ వెల్లడించినట్లు తెలుస్తోంది. భారీ వర్షం కారణంగా పెద్ద ఎత్తున నీరు, బురద గోడ వద్దకు చేరింది. పునాది బలంగా లేని గోడ కాబట్టి నీరు, బురద బరువుకు తట్టుకోలేక గోడ ఒక్కసారిగా కూలిపోయిందని కమిషన్ అంచనాకు వచ్చింది.
సింహాచలం ఘటన జరిగిన నేపథ్యంలో 72 గంటల్లోనే నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ ఘటనపై.. మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అధ్యక్షతన, ఈగల్ విభాగాధిపతి ఐజీ రవికృష్ణ, జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు సభ్యులుగా త్రిసభ్య కమిషన్ విచారణ చేపట్టింది. పలు సంచలన విషయాలను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచింది. గోడను పునాదులు కుడా లేకుండా నిర్మించారు. వర్షపు నీరు వెళ్లేందుకు కనీసం గోడకు లీప్ హోల్స్ కూడా పెట్టలేదని తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది.
అప్పన్న చందనోత్సవానికి 7 రోజుల ముందు ఈ గోడను హడావిడిగా నిర్మించినట్టు తేలిందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఆలయాల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన ప్రసాద్ స్కీమ్ లో భాగంగా గోడ నిర్మాణాన్ని తూతూమంత్రంగా నిర్మించారని పేర్కొంది. గోడ నిర్మాణానికి ఎలాంటి డిజైన్లు లేక పోగా పునాది కూడా లేకుండా నిర్మించేశారని ప్రాథమిక నివేదికలో కమిషన్ పేర్కొంది. గోడ నిర్మించే సమయంలోనూ ఎలాంటి తనిఖీలు చేయలేదని త్రిమెన్ కమిషన్ అభిప్రాయ పడింది.
ఇక ప్రముఖ మహిమాన్విత క్షేత్రం సింహాద్రి అప్పన్న ఆలయంలో ఏటా స్వామివారికి నిర్వహించే వార్షిక చందనోత్సవం వేడుకల సందర్భంగా ఈ విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

సింహాచలం లక్ష్మీనరసింహ స్వామివారికి ప్రతి సంవత్సరం చందనోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో నిజరూప దర్శనం ఇస్తారు. నిజరూప దర్శనం చేసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగునే ఉన్న ఒడిశా నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. ఈ ఏడాది చందనోత్సవానికి దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు హాజరైనట్లు అంచనాలు ఉన్నాయి.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications