చంద్రబాబుకు మరో సంకటం? విజయవాడ, కర్నూలు మధ్య పోటీ..!
ఏపీలో రెండు నెలల క్రితం ఏర్పాటైన కూటమి సర్కార్ గతంలో జరిగిన తప్పిదాలను సవరించుకుంటూ నవ్యాంధ్ర నిర్మాణం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇందులోనూ సమస్యలు తప్పడం లేదు. ఇదే క్రమంలో తాజాగా రాష్ట్రానికి సంబంధించిన ఓ కీలక కార్యాలయం ఏర్పాటు కోసం కీలక నగరాలైన విజయవాడ, కర్నూలు మధ్య పోటీ నెలకొంది. ఇందులో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్ధితి సీఎం చంద్రబాబుది. ఇందులో ఏదైనా తేడా జరిగితే మాత్రం సమస్య మరింత ముదరడం ఖాయంగా కనిపిస్తోంది.
రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా నదీ జలవివాదాల పరిష్కారం కోసం బోర్డును హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. తెలుగు రాష్టాల్లో ప్రవహిస్తున్న కృష్ణానది ఏపీలో తన ప్రయాణం ముగిస్తుంది. దీంతో చివరి రాష్ట్రమైన ఏపీలో కృష్ణాబోర్డు కార్యాలయం ఏర్పాటు కోసం గతంలో పలు ప్రయత్నాలు జరిగాయి. అయితే దీన్ని తమ ప్రాంతంలోనే, తమ నగరంలోనే ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వాలపై ఒత్తిడి వచ్చింది. ఈ క్రమంలోనే గత వైసీపీ సర్కార్ విశాఖలో ఏర్పాటు కోసం ప్రయత్నించింది.

అయితే రాయలసీమ పక్కగా ప్రవహిస్తూ కృష్ణాజిల్లాలో సముద్రంలో కలుస్తున్న కృష్ణానదీ యాజమాన్య బోర్డును విశాఖలో పెట్టడం ఏంటనే ప్రశ్నలు వినిపించాయి. దీంతో అప్పటి జగన్ సర్కార్ వదిలేసింది. ఇప్పుడు కూటమి సర్కార్ ముందు మాత్రం విజయవాడ, కర్నూలులో ఏదో ఒక చోట ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ కార్యాలయం విజయవాడలోనే పెట్టబోతున్నారనే సమాచారంతో రాయలసీమ నేతలు అప్రమత్తమయ్యారు. తాజాగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజును కలిసిన రాయలసీమ నేతలు కర్నూలులోనే కేఆర్ఎంబీ ఆఫీసు ఏర్పాటు చేయాలని కోరారు.
అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో చంద్రబాబు కర్నూలును ఎంచుకుంటారా లేక విజయవాడలోనే ఈ ఆఫీసు పెట్టేందుకు సిద్ధపడతారా అన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు రాయలసీమలోనే పుట్టినా ఆ ప్రాంతానికి ఏమీ చేయలేదని ఆయన ప్రత్యర్థులు ఆరోపించేవారు. ఇప్పుడు కేఆర్ఎంబీ కార్యాలయం విజయవాడలో పెడితే మరోసారి అదే విమర్శలు చంద్రబాబు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో సీఎం నిర్ణయం ఏంటో తేలాల్సి ఉంది.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications