తిరుమలలో రోజుకు 300 ట్రిప్పులతో ఉచిత బస్సులు

తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మ రథాలకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఇటీవలే డిజిటల్ డిస్ ప్లే బోర్డుల ఏర్పాటుతో మరింత ప్రజాదరణ పొందుతున్నాయి. బస్సులు వచ్చే సమయాన్ని భక్తులు ముందుగానే తెలుసుకునేలా వీటిని ఏర్పాటు చేయడం వల్ల వేచిచూసే సమయం తగ్గింది. దీంతో ఉచిత రవాణా సేవలను భక్తులు విస్తృతంగా వినియోగిస్తోన్నారు. వీటి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.

ప్రస్తుతం తిరుమలలో మొత్తం 12 ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉంటోన్నాయి. ఇటీవలే నయాతి హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ ఆగ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మరో బస్సును టీటీడీకి విరాళంగా అందజేసింది. దీంతో వీటి సంఖ్య 13కు పెరిగింది. రోజుకు సగటున 300 ట్రిప్పులు నడుస్తున్నాయవి. ఈ విధానం దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల్లో భక్తుల కోసం రియల్ టైమ్ బస్ సమాచారం అందించే మొదటి సాంకేతిక ప్రయోగంగా నిలుస్తోంది.

TTD Digital Display Boards Make Tirumala Free Transport Dharma Rathas Smarter Than Digital Boards

రోజుకు 60 వేల మంది భక్తులు సురక్షితంగా ప్రయాణం

రియల్ టైమ్, డిస్ ప్లే మేనేజ్మెంట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత రోజుకు సుమారు 60,000 మంది భక్తులు ఈ ఉచిత బస్సు సేవలను వినియోగిస్తోన్నారు. గతంలో ఉచిత బస్సు వచ్చే సమయం ముందుగా తెలియకపోవడంతో భక్తులు ప్రైవేట్ ట్యాక్సీల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపేవారు. ఈ సమస్యను గుర్తించిన టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి చొరవతో డిజిటల్ డిస్ ప్లే బోర్డులు ఏర్పాటయ్యాయి.

దీనికోసం హైదరాబాద్ కు చెందిన బీఎస్ టెక్నోట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డిజిటల్ బోర్డులను విరాళంగా అందించింది. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోంది. ఈ విధానం అమలు చేసినప్పటి నుండి బస్టాప్ వద్దకు వచ్చిన భక్తులకు బస్సు వచ్చే సమయం ప్రత్యక్షంగా తెలియడం, 10 నిమిషాల లోపే బస్సులు రావడంతో భక్తులు ఉచిత బస్సు సేవలను విరివిగా వినియోగించుకుంటున్నారు.

ఇంధన వినియోగం తగ్గడం..

ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం ద్వారా ఇంధన వినియోగం తగ్గడంతో పాటు కాలుష్య నియంత్రణకు కూడా ఈ సౌకర్యం దోహదపడుతోంది. అదేవిధంగా తిరుమలలో వాహన రద్దీని తగ్గించి కాలుష్య నియంత్రణ దిశగా పటిష్టమైన ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడానికి, భక్తులకు సౌకర్యవంతమైన, పర్యావరణ హితమైన రవాణా అందించాలనే లక్ష్యంతో టీటీడీ ఈ విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేసే దిశగా చర్యలు చేపడుతోంది.

భక్తుల కోసం రాత్రుల్లో..

ప్రస్తుతం రాత్రి 9 నుండి తెల్లవారు జామున 5 గంటల వరకు ఈ ఎలక్ట్రిక్ బస్సులు 60 ట్రిప్పులు తిరుగుతుండగా భక్తుల సౌకర్యార్థం అదనంగా మరో 20 ట్రిప్పులను పెంచనున్నారు. అదే విధంగా రాబోయే రోజుల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా అదనంగా మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+