TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాము, ఈవో తనిఖీలు
తిరుమలలోని సప్తగిరి సత్రాలు, సీఆర్ఓ కార్యాలయాన్ని టీటీడీ ఈవో జే. శ్యామలరావు, అడిషనల్ ఈవో సీ హెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీధర్లతో కలిసి శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు.మొదట సప్తగిరి సత్రాలు వద్ద శ్రీవారి భక్తులు బస చేస్తున్న గదులను పరిశీలించారు. టీటీడీ ఈవో శ్యామలరావు, టీటీడీ అధికారులు ఆకస్మికంగా ఆ ప్రాంతాలకు వెళ్లి అక్కడ బస చేసిన శ్రీవారి భక్తల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

తరువాత తిరుమల యాత్రికులతో ఈవో శ్యామలరావు మాట్లాడి కౌంటర్ల వద్ద గదుల కేటాయింపు ప్రక్రియను పరిశీలించారు.అనంతరం సెంట్రల్ రిసెప్షన్ కార్యాలయంలో భక్తులకు గదుల కేటాయింపు ప్రక్రియను ఈవో శ్యామలరావు పరిశీలించారు. ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డు, ఇన్ఫర్మేషన్ కియోస్క్లను తనిఖీ చేయడంతోపాటు కర్ణాటక, తమిళనాడులోని కళ్లకురిచ్చి నుంచి వచ్చిన భక్తులతో ఈవో శ్యామలరావు మాట్లాడి వారి నుంచి విzరాలు సేకరించారు.












Click it and Unblock the Notifications