TTD: టీటీడీ తాజా నిర్ణయం, నేరుగా శ్రీవారి దర్శనం - కొత్త వేళలు, కీలక సూచనలు..!!

Tirumala: టీటీడీ మరి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఉదయం రద్దీ తగ్గింది. నేరుగా శ్రీవారి సర్వ దర్శనం కొనసాగుతోంది. వాారారంతపు సెలవుల్లో దర్శనం 18 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవులు ముగిసే వరకూ ఇదే తరహాలో రద్దీ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాల పైన టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సిఫారసు లేఖలను రద్దు చేయటంతో పాటుగా బ్రేక్ దర్శనాల ను పరిమితం చేసింది. అదే విధంగా బ్రేక్ దర్శన వేళల్లోనూ మార్పులు మొదలు పెట్టింది.

సిఫారసు లేఖల రద్దు
వేసవి సెలవుల్లో భారీగా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా టీటీడీ కొత్త నిర్ణయాలు తీసుకుంది. మే 1వ తేదీ నుంచి బ్రేక్ దర్శనాల్లో మార్పులు చేస్తోంది. అదే విధంగా మే 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు సిఫారసు లేఖలు అనుమతించకూడదని నిర్ణయించింది. ప్రజాప్రతినిధులు, టీటీడీ బోర్డు సభ్యుల సిఫార్సు లేఖలు చెల్లవని టీటీడీ స్పష్టం చేసింది. ప్రొటోకాల్‌ వీఐపీలకు మాత్రమే బ్రేక్‌ దర్శనాలు ఉంటాయని టీటీడీ వెల్లడించింది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్య త కల్పించేందుకు సిఫార్సు లేఖలు రద్దు చేసినట్లు టీటీడీ స్పష్టం చేసింది. అదే విధంగా బ్రేక్ దర్శనాల సమయంలో మార్పుల ను ప్రయోగాత్మాకంగా అమలుకు నిర్ణయించింది.

ttd-is-set-to-implement-several-key-decisions-from-may-01-onwards

బ్రేక్ వేళల మార్పు
తిరుమలలో మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో టీటీడీ మార్పులు చేసింది. మే 1 నుంచి ఉదయం 6 గంటల నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభం అవుతాయని వెల్లడించింది. వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే వీఐపీ దర్శనం కల్పిస్తామని వెల్ల డించింది. మే 1 నుంచి జులై 15వ వరకు ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు టీటీడీ అధికా రులు స్పష్టం చేసారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకు న్నట్లు వెల్లడించింది. ఈ వేళల మార్పు ద్వారా ఎక్కువ సమయం క్యూ లైన్లలో ఉంటున్నా సాధా రణ భక్తులకు ప్రయోజనం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న కొత్త వేళల ద్వారా ఎలాంటి ఫలితం ఉంటుందో గమనించి.. కొనసాగింపు పైన నిర్ణయించనున్నారు.

Take a Poll

కొనసాగుతున్న రద్దీ
మరోవైపు వేసవి సెలవులు, వారాంతం నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. సర్వదర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులతో శ్రీవారిమెట్టు మార్గంలో ట్రాఫిక్‌ స్తంభించింది. చిన్నారులతో వచ్చిన తల్లిదండ్రులు అల్లాడిపోయారు. ఎస్‌ఎస్‌డీ టోకెన్ల కోసం క్యూలో ఉన్న భక్తులు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. నెలల చిన్నారులతో క్యూలైన్‌లో ఉన్న తల్లుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మరోవైపు తిరు మలలో పోలీసుల హైఅలర్ట్ కొనసాగుతోంది. బస్టాండ్లు, హోటళ్లు, మఠాల వద్ద బాంబ్, డాగ్ ‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఘాట్ రోడ్లలో పలుచోట్ల వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+