టిటిడిలో భారీ కుంభకోణం: ఏడాదిలో 60వేల లడ్డూలు కాజేశాడు
చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగి ఒకరు భారీ కుంభకోణంలో దొరికిపోయాడు. అతనిని దేవస్థానం సస్పెండ్ చేసింది. ఒక ఏడాదిలో అరవై వేల లడ్డూలు కాజేసినట్లుగా వెంకటరమణ అనే ఉద్యోగి పైన ఆరోపణలు వచ్చాయి.
అతని అక్రమాల బాగోతం డిప్యూటీ ఈవో దృష్టికి వచ్చాయి. డిప్యూటీ ఈవోకు అనుమానం రావడంతో ఈ కుంభకోణం బయటపడింది. శ్రీవారి ఖజానాకే వెంకటరమణ చిల్లు పెట్టినట్లుగా నిర్ధారించుకున్నారు. భక్తులకు పంపాల్సిన లడ్డూలను అతను కాజేశాడు.
ఏడాదిలో భక్తులకు చెందిన అరవై వేల లడ్డూలు కాజేసిన అధికారి వెంకట రమణ పైన వెంటనే చర్యలు తీసుకున్నారు. అతనిని సస్పెండ్ చేస్తున్నట్లు ఈవో సాంబశివ రావు చెప్పారు. రెండున్నరేళ్లుగా వెంకటరమణ డోనర్ సెల్లో పని చేస్తున్నాడు. ప్రస్తుతం అతనిని అధికారులు విచారిస్తున్నారు.

లడ్డూ అక్రమాల పైన విజిలెన్స్ విచారణ జరుగుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు. ఇక పైన అక్రమాలకు తావులేకుండా మార్పులు చేస్తామని చెప్పారు.
విజయవాడలో రెండో రోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభం
విజయవాడలో మంగళవారం నాడు కలెక్టర్ల సదస్సు జరుగుతోంది. రెండంకెల వృద్ధి, నెపుణ్యాభివృద్ధిపై సమీక్షను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల కలెక్టర్లు సదస్సులో పాల్గొన్నారు.
-
తిరుపతిలో బాసర తరహా అక్షరాభ్యాసం - ప్రత్యేకంగా కిట్లు, మార్గదర్శకాలు..!! -
తిరుమల క్యూ లైన్ లో నినాదాలు- టీటీడీ తాజా అప్పీల్ -
లడ్డూ వ్యవహారం లో సుప్రీం తాజా ఆదేశాలు..!! -
భక్తులకు షాక్!: వెంకటేశ్వర స్వామి ప్రసాదశాలలో గ్యాస్ కష్టాలు! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications