Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TTD: మార్చిలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేషఉత్సవాలు; తిరుపతిలో మరో అన్నదాన కేంద్రం!!

కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడు కొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోనూ, టిటిడి కి అనుబంధంగా ఉన్న ఇతర ఆలయాలలోను మార్చి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇదే క్రమంలో టీటీడీ మార్చి నెలలో తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో జరగనున్న విశేష ఉత్సవాలకు సంబంధించి ఒక ప్రకటన చేసింది.

మార్చి నెలలో తిరుపతిలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో 2, 9, 16, 23, 30 తేదీలలో శనివారం సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణుల మూల మూర్తులకు ఉదయం ఆరు గంటలకు అభిషేకం నిర్వహిస్తారని పేర్కొంది. మార్చి పదవ తేదీన అమావాస్య సందర్భంగా ఉదయం ఎనిమిది గంటలకు సహస్ర కలశాభిషేకం చేపట్టి, రాత్రి 7 గంటలకు స్వామివారికి హనుమంత వాహన సేవను జరపనున్నట్లు టీటీడీ పేర్కొంది.

TTD: Special Festivals at Sri Kodandaramaswamy Temple in March; Another food donation center in Tirupati!!

ఇక మార్చి 19వ తేదీన పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం జరపనున్నట్లు పేర్కొంది. ఆపై అదే రోజు సాయంత్రం ఐదున్నర గంటలకు శ్రీ సీతారామచంద్ర మూర్తిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకువెళ్లి వేడుక నిర్వహిస్తారు. సాయంత్రం ఆరున్నర గంటలకు స్వామివారికి ఊంజల్ సేవను నిర్వహిస్తారు.

మార్చి 25వ తేదీన పౌర్ణమి సందర్భంగా ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాలకు శ్రీ రామచంద్రమూర్తికి అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహిస్తారు. ఆపై సాయంత్రం ఐదున్నర గంటలకు మళ్లీ ఆలయ మాడ వీధుల నుంచి, శ్రీరామ చంద్ర పుష్కరిణి వరకు తిరుచి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆపై సాయంత్రం 6:30 గంటలకు ఆస్థానం నిర్వహిస్తారు.

TTD: Special Festivals at Sri Kodandaramaswamy Temple in March; Another food donation center in Tirupati!!

ప్రతినెల తిరుమల శ్రీవారికి, శ్రీవారి అనుబంధ ఆలయాలకు విశేష ఉత్సవాలను నిర్వహించడం మాత్రమే కాకుండా, టీటీడీ భక్తుల సౌకర్యార్థం అనేక ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల ఆకలిని తీర్చే మరో అన్నదాన వితరణ కేంద్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిన్న ప్రారంభించింది. ప్రపంచ నలుమూలల నుంచి తిరుపతికి వచ్చే భక్తుల కోసం నిరంతరం అన్నదాన వితరణ తిరుపతిలో కూడా జరగాలన్న ఉద్దేశంతో మరో అన్నప్రసాద కేంద్రాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది టీటీడీ.

తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం పక్కనున్న పాత మ్యూజియం భవనంలో అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాన్ని అందిస్తున్నట్లు కరుణాకర్ రెడ్డి మీడియాకు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఙప్తి చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+