సహజీవనం, మోసం: ప్రియుడిపై టీవీ యాంకర్ ఫిర్యాదు
హైదరాబాద్: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, సహ జీవనం చేస్తూ చివరకు మోసం చేసి వేరొక పెళ్లికి సిద్ధమవుతున్నాడంటూ ప్రియుడి పైన ఓ టీవీ యాంకర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఎస్సార్ నగర్ కమ్యూనిటీ హాలు సమీపంలో నివసించే టీవీ యాంకర్ అనుశ్రీ, అర్జున్ గత అయిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఇద్దరు కలిసి ఒకేచోట ఉండేవారు. పెళ్లి చేసుకుంటానని చెప్పిన అర్జున్ ఇటీవల కనిపించకుండా పోయాడు. విశాఖలో మరో యువతిని అర్జున్ శనివారం పెళ్లి చేసుకోబోతున్నాడంటూ గురువారం రాత్రి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకోవడం కోసం ఓ బృందాన్ని విశాఖకు పంపుతామని పోలీసులు తెలిపారు.
అన్నను హత్య చేసిన తమ్ముడు
మద్యం మత్తులో తల్లిదండ్రులను డబ్బు కోసం వేధిస్తున్న అన్నను సోదరుడు బండరాయితో మోది హత్య చేశాడు. వెంకటపూర్లోని ఫాతిమానగర్కు చెందిన జిలానీఖాన్, సాబెరబేగం దంపతులకు ఏడుగురు సంతానం. రెండో కుమారుడు అహ్మద్ఖాన్ (29), రేడియో క్యాబ్ డ్రైవర్. నాలుగు సంవత్సరాల క్రితం ఇతడికి వివాహమైంది. ఎనిమిది నెలల క్రితం అహ్మద్ఖాన్ భార్య విడాకులు తీసుకుంది. అప్పటినుంచి అహ్మద్ఖాన్ పనికి వెళ్ళడం లేదు. మద్యానికి బానిసయ్యాడు.
మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వమని రోజూ తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. బుధవారం రాత్రి మద్యం మత్తులో గొడవపడ్డాడు. సర్ది చెప్పబోయిన తల్లిని చితకబాదాడు. అక్కడే ఉన్న అహ్మద్ఖాన్ సోదరుడు అజ్మత్ఖాన్ తల్లిని కొట్టవద్దని వారించాడు. అయినా వినకపోవడంతో అహ్మద్ఖాన్ను కిందపడేసి బండరాయితో తలపై మోది హత్య చేశాడు. గురువారం ఉదయం పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.