వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కి షాక్: టిడిపిలోకి ఇద్దరు ఎంపీలు, బుజ్జగింపులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాక్! ఇటీవల జగన్ పార్టీ నుండి పార్లమెంటు సభ్యులుగా గెలుపొందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. వారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో టచ్‌లో ఉన్నారట. వారి దారిలోనే మరికొందరు ఎమ్మెల్యేలు ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున కర్నూలు, నంద్యాల లోకసభల నుండి ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుకలు పోటీ చేసి గెలుపొందారు. అయితే పలు కారణాలతో వారు జగన్ నుండి దూరం వెళ్లాలనుకుంటున్నారట.

Two MPs may join in Telugudesam

తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చినందున మరో ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌‍లో జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, అలాగే కేంద్రంలో ఎన్డీయే కూటమిలో టిడిపి ఉందని, దానికి తోడు వైయస్ జగన్ కేసులలో ఇరుక్కోవడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని, ఈ కారణంగానే బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డిలు టిడిపిలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. వారు న్యూఢిల్లీలో చంద్రబాబుతో ఆదివారం మధ్యాహ్నం కలిసే అవకాశాలు ఉన్నాయి.

బుజ్జగింపులకు రంగంలోకి సీనియర్లు

బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డిలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారనే ఊహాగానాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్లు వారిని బుజ్జగించేందుకు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. సాయంత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముఖ్యనేతలు సమావేశం కానున్నారు.

English summary
It is said that two YSR Congress party MLAs may join in Telugudesam party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X