Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీకి తీపికబురు.. విశాఖపట్నం రైల్వే జోన్ పై కేంద్రమంత్రి ప్రకటన!

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అయిన విశాఖపట్నం రైల్వే జోన్ త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. నేడు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్‌లో విశాఖ-గుణపూర్ ప్యాసింజర్ రైలు హాల్ట్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి ఆయన ప్రారంభించారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రైల్వే కీలక పాత్ర

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, గత ఇరవై ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్న రైల్వే సౌకర్యాలు ఇప్పుడు అందుబాటులోకి రావడం తమకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఏపీలో రైల్వే పురోగతి కూటమి ప్రభుత్వ హయాంలో ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రైల్వే హాల్ట్‌లు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు .

Union Minister RamMohan Naidu said good news to uttarandhra Visakhapatnam Railway Zone to Launch Soon

అన్ని వర్గాలకు మేలు,డబ్బులు ఆదా

రైల్వేలు అవసరం అయిన చోట్ల హాల్టింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయటం ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ప్రయాణ సౌకర్యాలను సులభంగా పొందడంతో పాటు ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందని మంత్రి తెలిపారు. అలాగే, శ్రీకాకుళం జిల్లాకు మెరుగైన రైల్వే సదుపాయాలను అందించేందుకు కృషి చేసిన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు, ముఖ్యంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

మూలపేటలో నిర్మాణంలో ఉన్న పోర్ట్ పనులు త్వరలోనే పూర్తి

రానున్న రెండేళ్లలో ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని, ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్రమంత్రి అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ పరిధిలోని మూలపేటలో నిర్మాణంలో ఉన్న పోర్ట్ పనులు త్వరలో పూర్తవుతాయని కూడా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్!
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్!

ఉత్తరాంధ్రలో రవాణా రంగాన్ని బలోపేతం చేసేలా మూలపేట పోర్టు

ఆ పోర్ట్ ప్రారంభమైతే అంతర్ రాష్ట్ర రవాణా సౌకర్యాలు పెరిగి, వ్యాపార కార్యకలాపాలు విస్తరించి, ప్రాంతీయ అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయని కేంద్రమంత్రి వివరించారు.అనంతరం గుణపూర్, మందస ప్రాంతాల్లో పలు ట్రైన్ హాల్ట్‌లను ప్రారంభించారు. ఈ చర్యలు ఉత్తరాంధ్రలో రవాణా రంగాన్ని బలోపేతం చేస్తున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+