వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా పథకాలకు మీ పేర్లా ? జగన్ సర్కార్ ను వివరణ కోరిన కేంద్రం-స్మతీ ఇరానీ లేఖ

|
Google Oneindia TeluguNews

ఏపీలో కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను మార్చి వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న విధానంపై కేంద్రం ఇవాళ తీవ్రంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చడంపై జగన్ సర్కార్ వివరణ కోరింది. కేంద్రం నిధులు ఇస్తున్న పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇతరత్రా పేర్లు పెట్టుకోవడం ఆమోదయోగ్యం కాదని తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం నిధులిస్తున్న పోషణ్‌ అభియాన్ వంటి పథకాలకు రాష్ట్రాలు తమకు నచ్చిన పేర్లు పెట్టుకోవడం కుదరదని కేంద్రం ఇవాళ స్పష్టం చేసింది. కేంద్ర పథకాలకు ఏపీలో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న పాలు అని పేర్లు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఈ మేరకు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రఘురామ ఫిర్యాదుపై సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.2021-22కి సంబంధించి ఐసీడీఎస్‌, ఐసీపీఎస్‌ పథకాలకు ఇచ్చిన రూ.187 కోట్ల లెక్క చూపాలని ఇందులో ఇరానీ కోరారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరుకునపడింది.

union minister smriti irani seek jagan government reply over changing of central schemes names

Recommended Video

Omicron Variant : Covaxin May Have Edge - ICMR Officials || Oneindia Telugu

రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకాలకు మార్చిన పేర్లు, వాటి కోసం తీసుకున్న చర్యలపై ఓ నివేదిక పంపాలని ఆదేశించినట్లు ఎంపీ రఘురామరాజుకు ఇచ్చిన సమాధానంలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటిపై వివరణ ఇవ్వాల్సి ఉంది. వాస్తవానికి గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాం నుంచీ కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు పేర్లు మార్చి తమవిగా చెప్పుకుని అమలు చేసుకోవడంపై బీజేపీ మండిపడుతూనే ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ అదే పరిస్ధితి కొనసాగుతుందని బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం మాత్రం ఈ విమర్శల్ని పట్టించుకోవడం లేదు. దీంతో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ రంగంలోకి దిగారు. ఆయన లేఖకు మాత్రం కేంద్రం స్పందించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాల్సి ఉంది.

English summary
the union governemnt on today seek reply from andhrapradesh government over changing of names for centrally sponsored schemes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X