అందర్నీ లాగండి: బాబును ఏకేసిన రోజా, షాకింగ్.. 'కాల్ మనీలో లోకేష్ అనుచరుడు'
హైదరాబాద్: కాల్ మనీ - సెక్స్ రాకెట్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన, టిడిపి ప్రభుత్వం పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్, ఎమ్మెల్యే రోజా గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కాల్ మనీ నిందితులతో చంద్రబాబుకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని జగన్ అసెంబ్లీలో ఫోటోలు ప్రదర్శించారు. శాసన సభ వాయిదా పడిన అనంతరం రోజా విలేకరులతో మాట్లాడారు. కాల్ మనీ నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు.
కాల్ మనీ దందాలో నారా లోకేష్ అనుచరుడు ఉన్నారని రోజా ఆరోపించారు. కాల్ మనీలో బుద్దా వెంకన్న ప్రధాన నిందితుడని, అతను నారా లోకేష్ అనుచరుడు కాబట్టే పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు అరాచక పాలన సాగుతోందన్నారు.
కాల్ మనీ వ్యవహారంలో అధికార పార్టీ నేతలే సూత్రదారులు అని ఆరోపించారు. కాల్ మనీ పైన సభలో చర్చ జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇందులో డబ్బులు పెట్టారని ఆరోపించారు.

టిడిపి నేతలు నిందితులకు తేలు కుట్టిన దొంగల్లా సహకరిస్తున్నారన్నారు. బుద్ధా వెంకన్న, బోడె ప్రసాద్లను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. కాల్ మనీ - సెక్స్ రాకెట్లో ఉన్న టిడిపి నేతలందర్నీ బయటకు లాగాలన్నారు. కాల్ మనీతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంత జరుగుతున్న చంద్రబాబుకు మహిళల బాధ పట్టడం లేదన్నారు. కార్యాలయానికి వెళ్లాలంటే మహిళలకు, కాలేజీకి వెళ్లాలంటే అమ్మాయిలకు భయం కలిగే పరిస్థితి ఉందన్నారు. వనజాక్షి, రిషికేశ్వరి ఘటనలను గాలికి వదిలేశారని, ఇప్పుడు కాల్ మనీ రాకెట్ను కూడా అలాగే చేద్దామని చూస్తున్నారన్నారు.
కాల్ మనీ - సెక్స్ రాకెట్ ముఠాతో చంద్రబాబుకు ప్రమేయం ఉందన్నారు. టిడిపి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయేదన్నారు. కాల్ మనీ నిందితులకు ప్రభుత్వం వంత పాడుతోందని మరో ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. శాసన సభ వాయిదా అనంతరం జగన్ మాట్లాడుతూ... ఇంత దారుణమైన ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంబేడ్కర్ అంటే మాకు గౌరవం ఉందని ఉప్పులేటి కల్పన చెప్పారు. అంబేడ్కర్ పైన చర్చకు తాము సిద్ధమని బిఏసిలో చెప్పామన్నారు. ఇప్పటికీ తాము సిద్ధమేనని చెప్పారు. తాము ఇఫ్పుడు ఈ స్థానంలో ఉన్నామంటే అది అంబేడ్కర్ చలువే అన్నారు. టిడిపి వారి కంటే తమకు అంబేడ్కర్ పైన ఎక్కువ గౌరవం ఉందన్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications