మేం వస్తే చంద్రబాబును జైల్లో పెడతాం: తమిళనాడు నేత సంచలనం
చెన్నై: తమిళనాడులో తాము అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిను జైలుకు పంపుతామని తమిళ పార్టీ ఎండిఎంకె పార్టీ అధినేత వైగో సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ క్రమంలో ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో సోమవారం ఆ రాష్ట్రంలోని కరూర్లో జరిగిన ప్రచారంలో వైగో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల తిరుపతి సమీపంలో జరిగిన తమిళ కూలీల ఎన్ కౌంటర్ను ప్రస్తావించారు.

ఎర్రచందనం కూలీల పేరిట 20మంది అమాయక తమిళ కూలీలను ఏపీ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసిందని ఆరోపించారు. ఎన్కౌంటర్ పేరిట తమిళులను చంపేసిన ఏపీ సీఎం చంద్రబాబును తాము అధికారంలోకి వస్తే తప్పకుండా జైలుకు పంపుతామన్నారు.
కాగా, గత ఏడాది శేషాచలంలో ఎర్రచందనం దొంగతనం నేపథ్యంలో ఇరవై మంది కూలీలను పోలీసులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన కూలీలు అందరూ కూడా దాదాపు తమిళనాడుకు చెందినవారే. ఈ నేపథ్యంలోనే ఆయన వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications