వందేభారత్ తో ఇంత లాభం ఉందా - తేల్చిన తాజా లెక్కలు..!!
వందేభారత్ వ్యవస్థ విమాన రంగం పైన ప్రభావం చూపుతోంది. వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన తరువాత విమాన ఛార్జీల్లో తగ్గుదల కనిపిస్తోంది. అదే సమయంలో ప్రధాన నగరాలకు విమానప్రయాణా లపైన ఆదరణ తగ్గుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దశల వారీగా అందుబాటులోకి వస్తున్న వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. విమానాల తరహాలో వందేభారత్ లో సీటింగ్..ఆహాన మెనూ వంటి సౌకర్యాలతో ప్రయాణీకులు విమానయానం కంటే వందేభారత్ కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు గుర్తించారు.
విమాన ప్రయాణం కంటే కొన్ని మార్గాల్లో వందేభారత్ లో ప్రయాణానికే ఆదరణ ఎక్కువగా ఉందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన తరువాత విమాన ఛార్జీల్లో సగటున 20 నుంచి 30 శాతం తగ్గాయని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. వందేభారత్ లో ధరలు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. అదే ఇప్పుడు విమాన ప్రయాణీకుల పైన ప్రభావం చూపుతోంది. విమాన ప్రయాణీకులు గంట ముందు విమానాశ్రయం చేరుకోవటం..ప్రయాణ సమయం..తరువాత గమ్య స్థానంలోని విమానాశ్రయం నుంచి కావాల్సిన చోటకు వెళ్లే సమయం..ఇలా అన్నీ పరిగణలోకి తీసుకున్న తరువాత వందేభారత్ కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు గుర్తించారు.

ప్రయాణికుల లింగం, వయస్సు ఆధారంగా వందే భారత్ రైళ్లడిమాండ్ను రైల్వే శాఖ తొలిసారి పర్యవేక్షిస్తోంది. ముంబయి నుంచి ప్రారంభమయ్యే వందే భారత్ లో అత్యధికులు 31-45 ఏళ్ల వయస్సు గలవారే.. ఆ తరువాతి స్థానంలో 15 - 30 ఏళ్ల వయస్కులు ఎక్కువగా ఉంటారు. సెప్టెంబర్ 15 - అక్టోబరు 13 మధ్య ముంబయి నుంచి షిర్డీ, గోవా, షోలాపూర్ వెళ్లే ప్రయాణికుల సంఖ్య గణాంకాలతో వివరించారు. మొత్తం 85 వేల 600 మంది పురుషులు, 26 మంది ట్రాన్స్జెండర్లు, 57 వేల 838 మంది మహిళలు వందేభారత్ లో ప్రయాణించారు. వందే భారత్ లో సేవలు, ఆహార మెనూ, ఇతర సౌకర్యాలతో ప్రయాణీకుల ఆదరణ పెరుగుతోందని గుర్తించారు. విమాన ప్రయాణంతో వందేభారత్ ప్రయాణం గురించి పోలిక మొదలైంది. దీంతో మరిన్ని మార్పులు చేసి.. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది?












Click it and Unblock the Notifications