ఏ సీఎం అయినా చేశారా?, ఏపీ పరువు పోతోంది: చంద్రబాబుపై వాసిరెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలను నమ్మించడం కోసం చేస్తున్న ఆర్భాటాల వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు పోతోందని వాసిరెడ్డి తీవ్రంగా విమర్శించారు.
ఆమె బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పట్టిసీమ పథకాన్ని చంద్రబాబునాయుడు ముచ్చటగా మూడోసారి ప్రారంభించారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక పథకాన్ని ఇన్నిసార్లు ఎక్కడైనా ప్రారంభించారా? అని వాసిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రం పరువు తీస్తున్నారని మండిపడ్డారు.
ఓ వైపు ముఖ్యమంత్రి మోటార్లు ఆన్ చేయగానే.. మరోవైపు ఇంజినీర్లు వెంటనే స్విఛ్ ఆఫ్ చేశారని ఆరోపించారు. 60కిలోమీటర్లు దాటితే నీళ్లు వెళ్లే పరిస్థితి లేదని, అందుకే ఇంజినీర్లు వెంటనే ఆపేశారని అన్నారు.

ఇదే చిత్తశుద్ధి పోలవరంపై ఉంటే ప్రాజెక్టు సగం పూర్తయ్యేదని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వలేని సీఎం చంద్రబాబు.. రాయలసీమకు ఎక్కడ నుంచి ఇస్తారన్నారని వాసిరెడ్డి పద్మ నిలదీశారు.
అప్పనంగానే సదావర్తి భూములు: నారాయణ
సదావర్తి సత్రం భూములను టిడిపి ప్రభుత్వం తమ అనుచరులకు అప్పనంగా కట్టబెట్టిందని సిపిఐ నేత నారాయణ ఆరోపించారు. బుధవారం చెన్నైలోని సదావర్తి భూములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తమిళనాడులోని తిరుచ్చేరి, తాళంబూర్లోని సదావర్తి భూముల వివరాలను తెలుసుకున్నారు.
ఇది ఇలా ఉండగా, చెన్నై నగరంలోని సదావర్తి సత్రానికి చెందిన దాదాపు 22 ఎకరాల భూమిని ఏపీకి చెందిన టిడిపి నాయకుడు చౌకగా కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఇటీవలే ఈ బృందం ఈ భూములను పరిశీలించి, నివేదికను పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సమర్పించింది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications