ఆంధ్రా నేతల వ్యాఖ్య నిజం చేస్తున్నావ్: కెసిఆర్పై విహెచ్

విద్యార్థులు, తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితితో కెసిఆర్ విలీనంపై చర్చించాలని సూచించారు. కెసిఆర్ మాట తప్పి ఆంధ్రా నేతల వ్యాఖ్యలు నిజం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ క్రెడిట్ కాంగ్రెసు పార్టీకే దక్కుతుందని వి హనుమంత రావు ఈ సందర్భంగా అన్నారు. సోనియా వల్లే తెలంగాణ సాధ్యమైందని అందరూ భావిస్తున్నారన్నారు. అమరవీరుల వల్లే సాధ్యమైందని చెప్పారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: గండ్ర
కెసిఆర్ విలీనంపై ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని గండ్ర వెంకటరమణ రెడ్డివరంగల్ జిల్లాలో అన్నారు. సోనియా పైన చెసిన వ్యాఖ్యలను కెసిఆర్ ఉపసంహరించుకోవాలని సూచించారు. కెసిఆర్ కాంగ్రెసు పార్టీతో పొత్తు పెట్టుకుంటే అధికార పక్షంలో ఉంటారు.. లేదంటే ప్రతిపక్షంలో ఉంటారన్నారు. అదే సమయంలో జగన్ పైనా మండిపడ్డారు. జగన్ ఏ మొహం పెట్టుకొని రేపు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారని ప్రశ్నించారు. జగన్ పర్యటిస్తే మానుకోట పునరావృతమవుతుందని హెచ్చరించారు.
తెరాస బలంగా ఉంది: మందా జగన్నాథం
తమ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేయదని మందా జగన్నాథం మహబూబ్ నగర్లో అన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణం తెరాసతోనే సాధ్యమన్నారు. తాము పెట్టిన షరతులకు కాంగ్రెసు ఒప్పుకుంటే తాము విలీనానికి సిద్ధమన్నారు. విలీనంపై దిగ్విజయ్, జైరామ్ రమేష్లు ఏకపక్షంగా మాట్లాడారన్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications