ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!
అమరావతి (Amaravati)ని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ మావిగన్ పేరుతో కొత్త రాజధాని ప్రాంతాన్ని తెరపైకి తెచ్చి కూటమి సర్కార్ ను టార్గెట్ చేస్తోంది. మచిలీపట్నం-విజయవాడ-గుంటూరుతో కూడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే అమరావతిలో పెట్టే ఖర్చు తప్పుతుందని, రాష్ట్ర ప్రజలపై భారం కూడా పడదని వైఎస్ జగన్ చేసిన ఈ ప్రతిపాదనపై రాష్ట్రంలో అనుకూల, వ్యతిరేక చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) స్పందిస్తూ సీఎం చంద్రబాబు (Chandrababu)కు కీలక సూచన చేశారు.
బెంగళూరును 1537లో కెంపె గౌడ, హైదరాబాద్ను 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా, చెన్నైని 1639లో ఫ్రాన్సిస్ డే ఆధ్వర్యంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించాయని, అవి నేటి మహానగరాలుగా మారడానికి వరుసగా 500, 430, 380 సంవత్సరాలు పట్టిందని సాయిరెడ్డి గుర్తుచేశారు. ఈ నగరాలు హడావిడిగా నిర్మించలేదని, తరతరాలుగా రూపుదిద్దుకున్నట్లు వెల్లడించారు. అమరావతిని కూడా అప్పుల డబ్బుతో, గొప్ప భ్రమలతో రాత్రికి రాత్రే నిర్మించలేమన్నారు. ప్రత్యేకించి అది చెప్పుకుంటున్నట్లుగా స్వయం సమృద్ధి కానప్పుడు అలా చేయలేమన్నారు.

ముందుగా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, మరియు ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమైన గృహాల వంటి ప్రాథమిక సౌకర్యాలను నిర్మించి, అక్కడితో ఆపాలని చంద్రబాబుకు సాయిరెడ్డి సలహా ఇచ్చారు. ప్రజలు, వ్యాపారాలు, మరియు కాలంతో పాటు అమరావతి సహజసిద్ధంగా ఎదగనివ్వాలన్నారు. ఒక రాజధాని నగరం బలం నుండి ఎదగాలి, అప్పుల నుండి కాదన్నారు. ఆకర్షణీయమైన డిజైన్లు, భారీ మౌలిక సదుపాయాలపై విచక్షణారహితంగా ఖర్చు చేయడం దార్శనికత కాదని, అది ఆర్థిక బాధ్యతారాహిత్యమే అన్నారు.

Bengaluru was founded in 1537 by Kempe Gowda, Hyderabad in 1591 by Muhammad Quli Qutb Shah, and Chennai in 1639 by the British East India Company under Francis Day. It took 500, 430, and 380 years respectively for them to become the metropolitan cities they are today.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 14, 2026
These…
ఈ రోజు అనవసరంగా ఖర్చు చేసే ప్రతి రూపాయి రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై భారం అవుతుందన్నారు. ఆదాయం ఆర్జించని ప్రాజెక్టులకు ఇచ్చే రుణాలు శ్రేయస్సును సృష్టించవు, పైగా అవి ప్రజా ఖజానాపై భారం మోపుతాయన్నారు. పరిపాలనకు కార్యాచరణ అవసరం, ఆడంబరమైన కట్టడాలు కాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం జాగ్రత్తను విస్మరిస్తే, అమరావతి ఒక ఆదర్శ రాజధానిగా కాకుండా, ఒక భారీ దుబారా కట్టడంగా మారే ప్రమాదం ఉందన్నారు.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
ప్రజలు సహకరించాలి, ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వినతి..!! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్















Click it and Unblock the Notifications