వంశీ అరెస్ట్ వెనుక - కిడ్నాప్, బెదిరింపులు..!!
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసారు. గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో వంశీ నిందితుడుగా ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసులో వంశీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని నెలలుగా వంశీ అమెరికాలో ఉంటున్నారు. కాగా, హైదరాబాద్ లో రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఉదయం విజయ వాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి గన్నవరం తరలిస్తున్నారు. అయితే, టీడీపీ కార్యాలయం పై కేసులో కాకుండా.. మరో కేసులో అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.
2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గన్నవరం ఎమ్మెల్యేగా గెలుపొందిన వల్లభనేని వంశీ ఆ తరువాత వైసీపీకి దగ్గరయ్యారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల పైన వంశీ అనుచిత కేసులు చేసారు. 2024 ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వంశీ ఓడిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి చేసులో నిందితుడుగా వంశీ ఉన్నారు. కాగా, ఈ కేసులో హైకోర్టులో వంశీ ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ మధ్య కాలంలోనే టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేషన్ తాను ఇచ్చిన ఫిర్యాదు పైన ఇచ్చిన స్టేట్మెంట్ కొత్త చర్చకు కారణమైంది.

ఇదే సమయంలో వంశీ పైన అక్రమంగా ఇసుక తవ్వకాల పైన కేసులు ఉన్నాయి. టీడీపీ ఆఫీసు పైన దాడి కేసులో హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉందని.. ఎలా అరెస్ట్ చేస్తారని పోలీసులను వంశీ ప్రశ్నించారు. అయితే, టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో కాదని.. మట్టి త్రవ్వకాల పైన కేసు ఉందని..అందులో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అరెస్ట్ ఏ కేసులో జరిగిందనేదీ మాత్రం పోలీసులు ఇంకా వెల్లడించలేదు. విజయవాడ కు తరలిస్తున్న పోలీసులు అక్కడ పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వంశీని అరెస్ట్ చేయాలంటూ టీడీపీ కేడర్ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తోంది. కాగా, ఇప్పుడు వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ మధ్నాహ్నం పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
కాగా, ఈ అరెస్ట్ వెనుక మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. టీడీపీ కార్యాలయం పై దాడి కేసు ను తాజాగా సత్యవర్ధన్ వెనక్కు తీసుకున్నారు. అయితే.. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించారని వంశీతో పాటుగా మరో అయిదుగురు పైన కేసు నమోదైంది. దీంతో, వంశీ తో సహా మరో ఐదుగురు పైన నమోదైన కేసులో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సత్యవర్ధన్ ను పోలీసులు విచారించగా.. ఇచ్చిన సమాచారం ఆధారంగా వంశీ పైన కేసు నమోదు చేసి.. హైదరాబాద్ లో అరెస్ట్ చేసినట్లు సమాచారం.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications