Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వంశీ అరెస్ట్ వెనుక - కిడ్నాప్, బెదిరింపులు..!!

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసారు. గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో వంశీ నిందితుడుగా ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసులో వంశీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని నెలలుగా వంశీ అమెరికాలో ఉంటున్నారు. కాగా, హైదరాబాద్ లో రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఉదయం విజయ వాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి గన్నవరం తరలిస్తున్నారు. అయితే, టీడీపీ కార్యాలయం పై కేసులో కాకుండా.. మరో కేసులో అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.

2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గన్నవరం ఎమ్మెల్యేగా గెలుపొందిన వల్లభనేని వంశీ ఆ తరువాత వైసీపీకి దగ్గరయ్యారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల పైన వంశీ అనుచిత కేసులు చేసారు. 2024 ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వంశీ ఓడిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి చేసులో నిందితుడుగా వంశీ ఉన్నారు. కాగా, ఈ కేసులో హైకోర్టులో వంశీ ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ మధ్య కాలంలోనే టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేషన్ తాను ఇచ్చిన ఫిర్యాదు పైన ఇచ్చిన స్టేట్మెంట్ కొత్త చర్చకు కారణమైంది.

Vijayawada Police Arrests Gannavaram YSRCP leader Vallabhaneni Vamsi

ఇదే సమయంలో వంశీ పైన అక్రమంగా ఇసుక తవ్వకాల పైన కేసులు ఉన్నాయి. టీడీపీ ఆఫీసు పైన దాడి కేసులో హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉందని.. ఎలా అరెస్ట్ చేస్తారని పోలీసులను వంశీ ప్రశ్నించారు. అయితే, టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో కాదని.. మట్టి త్రవ్వకాల పైన కేసు ఉందని..అందులో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అరెస్ట్ ఏ కేసులో జరిగిందనేదీ మాత్రం పోలీసులు ఇంకా వెల్లడించలేదు. విజయవాడ కు తరలిస్తున్న పోలీసులు అక్కడ పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వంశీని అరెస్ట్ చేయాలంటూ టీడీపీ కేడర్ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తోంది. కాగా, ఇప్పుడు వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ మధ్నాహ్నం పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

కాగా, ఈ అరెస్ట్ వెనుక మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. టీడీపీ కార్యాలయం పై దాడి కేసు ను తాజాగా సత్యవర్ధన్ వెనక్కు తీసుకున్నారు. అయితే.. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించారని వంశీతో పాటుగా మరో అయిదుగురు పైన కేసు నమోదైంది. దీంతో, వంశీ తో సహా మరో ఐదుగురు పైన నమోదైన కేసులో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సత్యవర్ధన్ ను పోలీసులు విచారించగా.. ఇచ్చిన సమాచారం ఆధారంగా వంశీ పైన కేసు నమోదు చేసి.. హైదరాబాద్ లో అరెస్ట్ చేసినట్లు సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+