వడ్డీ మహేష్ సమాచారం: 3 రాష్ట్రాల్లో 54 కంపెనీలపై దాడులు
ఉత్తరాంధ్రలో సంచలనం రేపిన హవాలా కుంభకోణంలో అరెస్టయిన వడ్డీ మహేష్ ఇచ్చిన సమాచారంతో ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. మూడు రాష్ట్రాల్లో బినామీ కంపెనీల పైన ఐటీ సోదాలు నిర్వహిస్తోంది.
విజయవాడ: ఉత్తరాంధ్రలో సంచలనం రేపిన హవాలా కుంభకోణంలో అరెస్టయిన వడ్డీ మహేష్ ఇచ్చిన సమాచారంతో ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. మూడు రాష్ట్రాల్లో బినామీ కంపెనీల పైన ఐటీ సోదాలు నిర్వహిస్తోంది.
ఇప్పటికే అరెస్టైన మహేష్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో పలుచోట్ల సోదాలు చేస్తున్నారు. 54 కంపెనీలపై దాడులు జరిగాయి. విశాఖ, శ్రీకాకుళం, చెన్నై తదితర ప్రాంతాల్లో జరిగాయి.

లేని కంపెనీలు సృష్టించి
లేని కంపెనీలను సృష్టించి హవాలా ద్వారా భారీ అక్రమాలకు పాల్పడిన స్కాం ఇటీవల ఉత్తరాంధ్రలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఇందులో కీలక నిందితుడు వడ్డీ మహేష్ను పోలీసులు అరెస్టు చేసారు. అతని నుంచి సమాచారం రాబడుతున్నారు.

విదేశాల్లో కేసు మూలాలు
హవాలా రూపంలో పెద్ద ఎత్తున నగదును విదేశాలకు తరలించి ఈ కేసు దర్యాఫ్తును ఇప్పటికే సీబీఐకి అప్పగించినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. కేసు మూలాలు విదేశాల్లో ఉన్నందున దర్యాఫ్తు తమకు భారమనే భావనతో సీఐడీకి అప్పగించినట్లు ఆయన తెలిపారు.

ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు?
మహేష్కు ముగ్గురు వ్యాపారులు డబ్బులు ఇచ్చినట్లు ఆయననే స్వయంగా తెలిపారు. అయితే వారు ఎవరు, ఆ డబ్బును ఎవరి ఖాతాలకు తరలించారనే విషయాలను పోలీసులు వెల్లడించలేదు. వారి వెనుక ఎవరైనా పెద్ద వ్యక్తులు ఉంటే దర్యాఫ్తుకు ఆటంకం కలుగుతుందన్న అనుమానంతో పేర్లు వెల్లడించలేదు.

విదేశాలకు వెళ్లి దర్యాఫ్తు
గత మూడేళ్లలో రూ.569.93 కోట్లు విదేశాలకు తరలించినట్లు మహేష్ విచారణలో ఇప్పటికే వెల్లడించారు. కానీ ఐటీ అధికారులు మరో రూ.800 కోట్ల వరకు విదేశాలకు తరలించాడని చెప్పారు. విదేశాలకు వెళ్లి దర్యాఫ్తు చేయాల్సి ఉంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications