వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'అవసరమైతే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి మోడీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటాం'

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: భారతీయ జనతా పార్టీతో జత కట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దొంగ పాదయాత్రలు చేస్తున్నారని ఎంపీ కొనకళ్ల నారాయణ గురువారం మండిపడ్డారు. తమకు వైసీపీ అసలు ప్రత్యర్థే కాదని వ్యాఖ్యానించారు.

మచిలీపట్నం పోర్టును వ్యతిరేకిస్తున్న జగన్‌కు కృష్ణా జిల్లాలో పర్యటించే హక్కు, అర్హత లేదన్నారు. కేంద్రం విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం దిగి వచ్చే వరకు తమ పోరాటం ఆగదన్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసైనా నరేంద్ర మోడీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామన్నారు.

We are ready to face Modi with third front: Konakalla

నగదు కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. నగదు కొరత కారణంగా రియల్ ఎస్టేట్ బాగా పడిపోయిందని చెప్పారు. వృద్ధి రేటు 2 శాతం తగ్గిందని, నిర్మాణాలు తగ్గిపోయాయని చెప్పారు. మనీ సర్క్యులేషన్ లేకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు అన్నారు.

సింగపూర్‌ను ఎలా నిర్మించాలో తెలుసుకోండి: పవన్ చురక, 'ఆయనతో శాంతిభద్రతల సమస్య'సింగపూర్‌ను ఎలా నిర్మించాలో తెలుసుకోండి: పవన్ చురక, 'ఆయనతో శాంతిభద్రతల సమస్య'

బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీలోకి తమ పార్టీ వారిని తీసుకోవద్దని జగన్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కోరారని ఆరోపించారు. బీజేబపీ, వైసీపీలు కలిసి చంద్రబాబును దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నాయన్నారు.

అమిత్ షా ఇష్టానుసారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని వర్ల ఎద్దేవా చేశారు. జగన్ ప్రధాని మోడీని ప్రశ్నించలేడని, కేసుల కోసమే ఆయన మౌనంగా ఉంటున్నారని, ఒకవేళ మోడీని ప్రశ్నిస్తే ఆ మరుక్షణం ఆయన జైల్లో ఉంటారని వ్యాఖ్యానించారు.

మాజీ మంత్రి, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని వర్ల గుర్తు చేశారు. ఆయన వైసీపీలోకి వెళ్లకుండా ఆపిందెవరని ప్రశ్నించారు. బీజేపీ - వైసీపీ మధ్య ప్రశాంత్ కిషోర్ అనుసంధాన కర్తగా ఉన్నారని చెప్పారు.

English summary
Telugudesam Party MP Konakalla Narayana on Thursday said that they are ready to face Narendra Modi in 2019 elections with third front also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X