పవన్ కల్యాణ్‌తో జత కట్టలేదు, ఆయనే మద్దతిచ్చారు: సిద్దార్థనాథ్ సంచలనం

ఏలూరు: పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీపై బిజెపి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ సిద్దార్థనాథ్ సింగ్ సంచలన ప్రకటన చేశారు. తాము జనసేనతో ఎప్పుడు కూడా జత కట్టలేదని, ఆ పార్టీయే తమకు ఎన్నికల్లో మద్దతు ఇచ్చిందని ఆయన బుధవారంనాడు చెప్పారు.

తెలుగుదేశం పార్టీతో తమకు ఏ విధమైన విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ఈ నెల 6వ తేదీన విజయవాడలో తమ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ర్యాలీ నిర్వహిస్తారని ఆయన చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన ర్యాలీ నిర్వహించారు.

We never forged alliance with Jana Sena: BJP

గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తెలుగుదేశం, బిజెపి కూటమికి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆయన ప్రత్యేక హోదా కోసం బిజెపిపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిద్ధార్థనాథ్ సింగ్ ఆ ప్రకటన చేసినట్లు అర్థమవుతోంది.

కాగా, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితో తెగదెంపులు చేసుకోవడానికి కూడా బిజెపి సిద్ధంగా లేదని అర్థమవుతోంది. ఇటీవల తన పర్యటన సందర్బంగా అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలు కూడా ఆ విషయాన్ని స్పష్టం చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+