పాక్ నుంచి ఫోన్ కాల్స్: భయాందోళనలో గోదావరి వాసులు
పశ్చిమగోదావరి: పాకిస్థాన్ ఫోన్ కోడ్ ఉన్న నెంబర్లతో ఫోన్కాల్స్ వస్తుండటంపై పశ్చిమగోదావరి జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా నిడదవోలు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, జంగారెడ్డిగూడెం, తదితర ప్రాంతాల్లో +92 3045414385 నంబరుతో, 0092 కోడ్తో ఫోన్కాల్స్ రావడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.
కాగా, పలు ప్రాంతాల సమాచారం సేకరించేందుకు పాకిస్థాన్ హ్యాకర్లు ఈ కాల్స్ చేస్తున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. మరో పక్క వాట్సప్ తదితర సోషల్ మీడియాలో ఇండియన్ ఆర్మీ హెచ్చరిక అంటూ వస్తున్న మెసేజ్లు, ఫొటోలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

అయితే ఇందులో వాస్తవాలను సేకరించి తెలియజేయాలని ప్రజలు కోరుతున్నారు. అలాంటి కోడ్తో వచ్చే ఫోన్ కా ల్స్ను రిసీవ్ చేసుకోవద్దని భద్రతా వార్గాలు పేర్కొన్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఎక్కువ సార్లు పాకిస్థాన్ కోడ్తో ఫోన్ కాల్స్ వస్తే పోలీసులను సంప్రదించడం మేలను పలువురు అంటున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications