'జగన్, పవన్ కళ్యాణ్లు ఓట్లు ఎలా అడుగుతారు, ఆ సభలో బాబు కీలక ప్రకటన'
కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వలేదని మంత్రి సుజయ కృష్ణ రంగారావు మంగళవారం మండిపడ్డారు. కనీసంకేంద్రం ఇస్తామన్న నిధులూ ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం యూసీలు ఇచ్చినా కుంటి సాకులు చెబుతూ పెండింగులో పెట్టిందని ధ్వజమెత్తారు.
కేంద్రం అన్యాయం చేస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. అన్యాయం చేస్తున్న కేంద్రాన్ని ప్రశ్నించకుండా జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు ప్రజలను ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.

ధర్మపోరాట దీక్ష సభలో స్టీల్ ప్లాంట్ పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేయనున్నారని మరో మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. కేంద్రం సహకరించకున్నా జిల్లాలో స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
వ్యవసాయం అనే పదం తెలియని వాళ్లు కూడా చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కళ్లున్న గుడ్డివాళ్లలా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని చెప్పారు.
Recommended Video



Click it and Unblock the Notifications