భర్తను చెట్టుకు కట్టేసి తల్లితో కూడి తగులబెట్టిన భార్య
హైదరాబాద్: విజయనగరం జిల్లాలోని గరివిడి మండలం వెదుళ్లవలసలో దారుణం జరిగింది. ఓ భార్య తన తల్లితో కలిసి భర్తను సజీవదహనం చేసింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలే ఈ అఘాయిత్యానికి కారణంగా తెలుస్తోంది.
తనను హతమార్చేందుకు ప్రయత్నించడంతో తల్లితో కలిసి భర్తను చెట్టుకు కట్టేసి నిప్పు పెట్టింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

పశ్చిమ గోదావరి జిల్లాలోని జీలుగుమిల్లి మండలంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దర్భగూడెం దగ్గర లారీ డ్రైవర్, క్లీన్పై దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమం ఉంది. మృతుడిది యూపీలోని తీసేన్పూర్ జిల్లా జిలార్పూర్గా పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు న మోదు చేసి విచారణ చేపట్టారు.
హవాలా కేసులో నలుగురు వ్యక్తులను సికింద్రాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.43 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications