మాంసం కూరలో మత్తు మందు కలిపి...ప్రియుడితో కలసి భర్తపై భార్య హత్యాయత్నం
గుంటూరు:తెలుగు రాష్ట్రాల్లో ప్రియులతో కలసి భర్త ను హత్య చేయడం లేదా భర్తపై హత్యాయత్నాలకు పాల్పడటం వంటి ఘటనలు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో గడచిన ఏడాది వ్యవధిలో ఇలాంటి ఘటనలు పదుల సంఖ్యలో నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రియుడితో కార్యకలాపాలకు భర్త అడ్డుగా ఉన్నాడనే యోచనతో కట్టుకున్నవాడిని కాటికి పంపించాలనే ప్రయత్నం చేసిన జాబితాలో మరో వివాహిత కూడా చేరింది. భోజనంలో మత్తుమందు కలిపి పెట్టి ప్రియుడితో కలసి భర్తను చంపేందుకు గుంటూరు జిల్లాకు చెందిన ఓ గృహిణి చేసిన విఫలయత్నం చేసింది...వివరాల్లోకి వెళితే...

బాధితుడి కథనం ప్రకారం...గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లికి చెందిన వినుకొండ దానియేలుకు అదే గ్రామానికి చెందిన రత్నకుమారితో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరూ కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు కుమార్తె, కుమారుడు కూడా ఉన్నారు. ఇదిలావుంటే పిడుగురాళ్ల మండలం జానపాడుకు చెందిన కంభంపాటి బెంజిమెన్ అనే వ్యక్తి కేసానుపల్లి ఎస్సీ కాలనీలో చర్చి పాస్టర్ లాగా మెలిగేవాడు. ఈ క్రమంలో బెంజిమన్ కు రత్నకుమారితో పరిచయం ఏర్పడి సాన్నిహిత్యానికి దారితీసింది.
అయితే కొన్నాళ్లకు ఈ విషయాన్ని గమనించిన గమనించిన భర్త దానియేలు పలుమార్లు బెంజిమెన్ను హెచ్చరించాడు. దీంతో భార్య రత్నకుమారి ప్రియుడు బెంజిమెన్ తో కలసి భర్త అడ్డు తొలగించుకోవాలని పథకం రచించింది. ఆ ప్లాన్ ప్రకారం ఆదివారం సాయంత్రం భోజనం పెట్టాలని భార్యను దానియేలు అడిగాడు. ఆమె ముందే ఉండి ఉంచిన మటన్ కూరలో ప్రియుడు తెచ్చి ఇచ్చిన నిద్రమాత్రలను కలిపి పెట్టింది. ఆ భోజనం తిని దానియేలు నిద్రపోయాడు. ఈ విషయం రత్నకుమారి బెంజిమెన్ కు తెలిపింది.
దీంతో రత్నకుమారి సహకారంతో బెంజిమెన్ వీరి ఇంట్లోకి ప్రవేశించాడు. నిద్రపోతున్న దానియేలు ముఖంపై దిండువేసి చంపేందుకు బెంజిమెన్ గట్టిగా నొక్కడం మొదలుపెట్టాడు. అయితే ఒక్కసారిగా ఊపిరాడకపోవడంతో ఉక్కిరిబిక్కిరి అయిన దానియేలు నిద్రమత్తులోనే పెద్దపెద్దగా కేకలు వేశాడు. పక్క ఇంటిలో నిద్రపోతున్న బంధువులు ఆ అరుపులు విని చుట్టుపక్కల వారికి తెలిపారు. దీంతో తమ బండారం బైటపడుతుందని భావించిన రత్నకుమారి, ఆమె ప్రియుడు బెంజిమెన్ అక్కడ నుంచి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుమేరకు దాచేపల్లి ఎస్ఐ అద్దంకి వెంకటేశ్వర్లు సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications