Amaravati: అమరావతికి రూ.15 వేల కోట్లు ఖాయమేనా? వరల్డ్ బ్యాంక్ గ్యారంటీ..!
ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్ల రుణసాయం ప్రపంచబ్యాంక్ నుంచి అందించేందుకు గ్యారంటీ ఇస్తామని ఈసారి కేంద్ర బడ్జెట్ లో ఆర్దికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది జరిగిన నెల రోజుల్లోపే ప్రపంచ బ్యాంక్ బృందం తాజాగా అమరావతి రాజధానికి వచ్చింది. రెండు రోజుల పాటు రాజధానిలో నిర్మాణాలను పరిశీలించిన వరల్డ్ బ్యాంక్ టీమ్ చివరిగా సీఎం చంద్రబాబుతో భేటీ అయి ఆయన విజన్ ఏంటో తెలుసుకుంది. ఈ భేటీలో వరల్డ్ బ్యాంక్ టీమ్ కీలక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
నలుగురు సభ్యుల వరల్డ్ బ్యాంక్ టీమ్ అమరావతిలో పర్యటించి భవనాల తాజా పరిస్ధితి తెలుసుకున్నాక చంద్రబాబుతో భేటీ అయింది. ఇందులో 2050 నాటికి అమరావతి జనాభా 35 లక్షలకు చేరుకుంటుందని, వీరికి ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.15 వేల కోట్లను రుణంగా ఇవ్వాలని చంద్రబాబు కోరారు. రాజధానిలో 20 శాతాన్ని పార్కులు, పచ్చదనంతో గ్రీన్ ఏరియాగా మార్చుతామని, అమరావతిలోని ప్రతి ఒక్కరూ కాలినడకన పార్కులకు చేరుకునే స్థాయిలో వీటిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. డ్రైనేజీ, రోడ్ల కనెక్టివిటీ, మంచినీరు, ట్రంక్ ఇన్ఫ్రాల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామన్నారు. వీటి కోసం తొలి విడతగా రూ.15 వేల కోట్లు కోరారు.

అయితే గతంలో రూ.3500 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమై చివరి నిమిషంలో స్ధానికుల నుంచి అందిన ఫిర్యాదులతో ఆగిపోయిన ప్రపంచబ్యాంక్.. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వద్దనడంతో ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకుంది. ఇప్పుడు పరిస్ధితులు ఎలా ఉన్నాయనే అంశంపై చంద్రబాబును ప్రపంచబ్యాంక్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో పరిస్ధితులు మారినప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించినట్లు సమాచారం. దీనిపై మరింత క్లారిటీ తీసుకునేందుకు మరోసారి అమరావతికి వస్తామని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు చంద్రబాబుకు తెలిపారు.
అయితే ఓవైపు కేంద్రం గ్యారంటీ ఉండటం, మరోవైపు చంద్రబాబు అమరావతి అభివృద్ధి ప్రణాళికల్ని ముందుంచిన నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ టీమ్ తదుపరి భేటీలో రూ.15 వేల కోట్ల రుణ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసే అవకాశాలున్నాయి. అదే జరిగితే సాధ్యమైనంత త్వరలో అమరావతిలో మౌలిక సదుపాయాల్పనతో పాటు ఇతర పనులు ప్రారంభం కాబోతున్నాయి.
-
రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్.. మాట నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్ -
YS Sharmila: బోడి 25 వేలకు మూడో బిడ్డను కనాలా ? చంద్రబాబుపై షర్మిల పంచ్..! -
పెన్షన్ పెంపు, వారికి ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు: సీఎం సంచలన ప్రకటన -
మండే ఎండల వేళ భారీ వర్షాలు, ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!! -
రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్, కీలక మార్పులు..!! -
నితీశ్ తర్వాత వికెట్ చంద్రబాబే? మాజీ కేంద్రమంత్రి జోస్యం..! -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు.. వారికి 6వేల జీతం పెంపు! -
Raisina Dialogue 2026: అప్పుడు తిట్టినోళ్లే ఇప్పుడు-చంద్రబాబు కామెంట్స్..! -
ఎమ్మెల్యేలు కావాలనుకునే మహిళలు సిద్ధంగా ఉండండి -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications