బాబుపై అసంతృప్తి: టిడిపికి ఆనం వివేకా గుడ్బై, రంగంలోకి వైయస్ జగన్?
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగలనుందా? ఆ అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో యేరిన ఆనం వివేకానంద రెడ్డి ఇప్పుడు పసుపు జెండాను .
విజయవాడ: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగలనుందా? ఆ అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో యేరిన ఆనం వివేకానంద రెడ్డి ఇప్పుడు పసుపు జెండాను వదిలేయాలనే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం సాగుతోంది.
తమకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయని ఆనం వివేకా ఆవేదనతో ఉన్నారని తెలుస్తోంది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని వాపోతున్నారని తెలుస్తోంది. 15 నెలలుగా పార్టీలో ఇమడలేకపోయారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు గాలం వేస్తోందని తెలుస్తోంది. భూమన కరుణాకర్ రెడ్డి ఆనం వివేకాతో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. నెల్లూరులో ఇప్పటికే వైసిపి బలంగా ఉంది. ఆనం కూడా వెళ్లిపోతే మరింత బలపడుతుంది.

టిడిపిలోకి సంవత్సరన్నర క్రితం..
ఆనం సోదరులు దాదాపు సంవత్సరంన్నర క్రితం కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే జిల్లా టిడిపి నేతలతో వారికి పొసగడం లేదని తెలుస్తోంది. అయితే, ఆనం వివేకా సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం ఆత్మకూరు ఇంచార్జిగానే కొనసాగుతారని అంటున్నారు.

చంద్రబాబు హామీలు
ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతారని, ఆనం వివేకా మాత్రమే పార్టీని వీడే అవకాశాలను కొట్టి పారేయలేమని అంటున్నారు. కాంగ్రెస్ నుంచి ఆనం సోదరులు టిడిపిలో చేరినప్పుడు చంద్రబాబు రెండు హామీలు ఇచ్చారు.

ఎమ్మెల్సీ లేనట్లే
ఆనం రామనారాయణకు ఆత్మకూరు ఇంచార్జి, వివేకాకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. రామనారాయణను ఆత్మకూరు ఇంచార్జిగా నియమించారు. వివేకాకు మాత్రం ఎమ్మెల్సీ వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం ఆనం సోదరులకు ఎమ్మెల్సీ పదవి లేనట్లేనని అంటున్నారు.

పార్టీని వీడేందుకు..
టిడిపిలో చేరినప్పటి నుంచి ఆనం రామనారాయణ ఆత్మకూరు ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. తనకు ఎమ్మెల్సీ రాకపోవడంతో.. వివేకా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. కనీసం తన పేరును కూడా పరిగణలోకి తీసుకోలేదని ఆవేదన చెందుతున్నారు. దీంతో ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. అయితే, వైసిపి నేతలు ఆయనతో ఫోన్ ద్వారా చర్చలు జరుపుతున్నారనే ప్రచారం సాగుతోంది.

నాడు వివేకా అసంతృప్తితోనే..
కాగా, ఆనం సోదరులు కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఏళ్ల పాటు ఓ వెలుగు వెలిగారు. సొంత కేడర్తో వ్యవహారాలు సాగిస్తూ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ సంక్షోభంలో కూరుకున్నా అదే పార్టీలో కొనసాగారు.
ఆనం రామనారాయణ టిడిపిలో చేరాలని నిర్ణయించి సోదరుడు వివేకాతో చర్చలు జరిపినప్పుడు వివేకా పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదనే వాదనలు ఉన్నాయి. ఇప్పట్లో కాంగ్రెస్ బలపడే పరిస్థితి లేదని రామనారాయణ.. వివేకాను సముదాయించడంతో సైకిలెక్కారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications