సూసైడ్ నోట్ గోడకు అతికించి, పిల్లలతో సహా బావిలో దూకి మహిళ ఆత్మహత్య

పిల్లలు జ్యోతిక 7వ తరగతి, సాత్విక్ 4వ తరగతి వెంకటగిరిలోని భాష్యం స్కూల్లో చదువుతున్నారు. గత కొంత కాలంగా వీరి కుటుంబంలో గొడవలు ఏర్పడ్డాయని తెలిసింది. సుజాత భర్త ప్రసాద్, అత్త ఇందిరమ్మ చిత్తూరు జిల్లాలో బంధువుల ఇంట్లో వివాహానికి వెళ్లారు. సుజాత తన ఇద్దరు పిల్లలతో ఇంటి వద్దే ఉంది.
సోమవారం తెల్లవారుఝామున ఆమె తన ఇద్దరు పిల్లలతో ఇంటికి ఎదురుగా ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి వద్ద ఉన్న గోడకు మరణ వాంగ్మూలపత్రం అంటించి, ఎవరూ తమ చావుకు కారణం కాదు అని రాసింది. బావిలో ఉన్న ముగ్గురి మృతదేహాలను వెంకటగిరి ఫైర్సిబ్బంది వెలికి తీశారు.
‘నా భర్త మంచివాడు.. కడుపు నొప్పికి తాళలేక తనువు చాలిస్తున్నా... భర్తకు బిడ్డలు భారం కాకూడదని నాతో పాటు వారిని తీసుకెళుతున్నా' అంటూ సూసైడ్ నోట్ రాసింది. పోలీసుస్టేషన్ వెనుకన పాడుబడ్డ బావిలో జోషిక మృతదేహం కనిపించింది. వెంకటగిరి అగ్నిమాపక సిబ్బందిని రప్పించి ముగ్గురి మృతదేహాలను వెలికి తీయించారు.
ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సీఐ నరసింహారావు మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం వెంకటగిరికి తరలించారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ బాలాయపల్లిలో మృతదేహాలను పరిశీలించి కుటుంబీకులను పరామర్శించారు.












Click it and Unblock the Notifications