విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కార్మికుల ఛలో ఢిల్లీ .. జంతర్ మంతర్ వద్ద ఆందోళనలకు రంగం సిద్ధం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కేంద్రం ముందుకు వెళుతూనే ఉంది. ప్రైవేటీకరణ చేసి తీరుతామని స్పష్టంగా చెబుతోంది. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లోనూ, హైకోర్టులో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాఖలైన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిటిషన్ విచారణ సమయంలోనూ కేంద్రం తమ వైఖరి స్పష్టంగా చెప్పింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను 100% ప్రైవేటీకరణ చేస్తామని తేల్చిచెప్పింది.
కేంద్రం తీరుతో విశాఖ ఉక్కు కార్మికులు ఆందోళనను ఉదృతం చేశారు. విశాఖ ఉక్కు కార్యాచరణ సమితి జాతీయ స్థాయిలో ఆందోళన కు పిలుపునిచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు తమకు మద్దతు తెలపాలని, ప్రత్యక్ష పోరాటంలో పాల్గొనాలని విశాఖ ఉక్కు కార్యాచరణ సమితి రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ వేదికగా నిరసనకు సిద్ధమవుతున్న విశాఖ కార్మికులు, వేలాది సంఖ్యలో విశాఖ నుండి హస్తినకు బయలుదేరాడు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఈ నెల 2, 3 తేదీలలో నిరసనలు తెలపడానికి సన్నాహాలు చేసుకున్నారు.

జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తేనే కేంద్రం దిగి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో ఆగస్టు 2,3 వ తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహా ధర్నా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలోనే వేలాది సంఖ్యలో విశాఖ ఉక్కు కార్మికులు ఢిల్లీ బయలుదేరారు. ఈ రోజు కొందరు విమానాల్లో ఢిల్లీకి చేరుకుంటున్నారు.శనివారం రాత్రి నుండి ఢిల్లీ బాట పట్టిన విశాఖ ఉక్కు కార్మికులు తమ గళాన్ని ఢిల్లీ వేదికగా గట్టిగా వినిపించనున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి తీరుతామని చెప్పిన కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైల్వే స్టేషన్లకు చేరుకున్న కార్మికులు కేంద్రం దిగి వచ్చే వరకు పోరాటాలు ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు.జనవరి నెలలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటించిన నాటి నుండి కార్మికులు పోరాటం చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదున్నర నెలలుగా పోరాడుతున్నా కేంద్రానికి తమ గోడు ఎందుకు పట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు విశాఖ ఉక్కు కార్మికులు. కేంద్రం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్టీల్ ప్లాంట్ కార్మికులు స్పష్టం చేస్తున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications