కేసీఆర్ చిత్ర పటానికి ఏపీలో పాలాభిషేకం: ఆ నిర్ణయంపై హర్షం..
ఒంగోలు: రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చాకచక్యంగా వ్యవహరించారనే చెప్పాలి. ఇద్దరు బీసీలను రాజ్యసభకు పంపించడానికి ఆయన నిర్ణయం తీసుకోవడంతో.. ఆ సామాజిక వర్గంలో హర్షం వ్యక్తమవుతోంది.
ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించడం ద్వారా.. తన బంధువు సంతోష్ కుమార్ విషయంలో వచ్చే విమర్శలను తప్పించుకోగలిగారు కేసీఆర్. బీసీలకు సీట్లు కేటాయించడం ప్రధానంగా హైలైట్ కావడంతో ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోనూ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం విశేషం. యాదవ్ అయిన బడుగుల లింగయ్యతో పాటు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాష్ లను రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేయడంతో.. ఏపీలోని యాదవ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది.
ఒంగోలు కలెక్టరేట్ వద్దకు భారీ ర్యాలీగా వచ్చిన యాదవ జేఏసీ.. అనంతరం కలెక్టరేట్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేసింది. ఈ సందర్భంగా కేసీఆర్ కు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇప్పటికే ఏపీలోనూ తనకంటూ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న కేసీఆర్ కు రోజురోజుకు అక్కడి వర్గాల నుంచి కూడా మద్దతు పెరుగుతుండటం గమనార్హం.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications