నకిలీ డాక్యుమెంట్ల కేసులో కోర్టుకెళ్ళిన వైసీపీ ఎమ్మెల్యే
ఏపీలో ప్రధాన పార్టీల మధ్య కేసుల పర్వం చాలా కాలంగా కొనసాగుతుంది. టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా వివాదం ఉంది . ఇక కేసులు, కోర్టులు ఏపీలో రాజకీయ నాయకులకు సర్వ సాధారణ విషయంలా తయారైంది . గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యర్థిగా ఉన్న నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి మధ్య వివాదం ఓ రేంజిలో సాగింది . దీని ప్రభావమే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.

కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పరువు నష్టం దావా వేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
అసలు విషయం ఏమిటంటే టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి , కాకాణి గోవర్ధన్ రెడ్డి మధ్య వార్ బాగానే సాగింది. ఇరువురు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడంతో పాటుగా పరస్పరం కేసులు పెట్టుకున్నారు. ఇక ఈ ఇద్దరు నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఓ రేంజిలో జరిగింది. ఇక నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి హవాలాకు పాల్పడ్డారని సోమిరెడ్డిపై కాకాణి సంచలన ఆరోపణలు చేశారు .

కాకాణి నిరాధార ఆరోపణలతో పరువుకు భంగం కలిగిస్తున్నారన్న సోమిరెడ్డి
అయితే ఈ వ్యవహారంలో కాకాణి సమర్పించిన పత్రాలన్నీ నకిలీవని ఆరోపించిన సోమిరెడ్డి కాకాణిపై పరువు నష్టం దావా వేశారు . తనపై కావాలని అభియోగాలు చేస్తున్నారని , నిరాధార ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగిస్తున్నారని ఆయన ఏకంగా ఆయన కోర్టుకెక్కారు. ఈ కేసు నెల్లూరులోని నాలుగో అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది.

కాకాణి నకిలీ పత్రాలు సృష్టించి తనపై ఆరోపణలు చేశారని ఫిర్యాదు
తప్పుడు పత్రాలు సృష్టించి తనపై బురదజల్లుతున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ప్రాధమికంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు అవి నకిలీ పత్రాలని తేల్చేశారు . కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన చిరంజీవి అలియాస్ మణిమోహన్పై కేసు నమోదు చేశారు. ఆ తరువాత ఆ నకిలీ డాక్యుమెంట్లన్నీ చిరంజీవిని రూపొందించారని నిర్ధారించుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

కేసు విచారణకు కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి
ఇక మరోవైపు తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ నాడు మంత్రిగా ఉన్న సోమిరెడ్డి, కాకాణిపై పరువు నష్టం దావా వేశారు. ఆ కేసుల విచారణలో భాగంగా సోమవారం కాకాణి నెల్లూరులోని 4వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు.నకిలీ డాక్యుమెంట్లు, పరువు నష్టం కేసుల్లో నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కోర్టులో విచారణకు హాజరయ్యారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications