రాజీనామాలు, దీక్షలు - జగన్ సంచలనం, ముహూర్తం ఫిక్స్..!!
ఏపీ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం దిశగా కసరత్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తి కావటంతో ఇక ప్రజల్లోకి వెళ్లాలని జగన్ డిసైడ్ అయ్యారు. కూటమి పార్టీల పైన ఒత్తిడి పెంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు. మెడికల్ కాలేజీల అంశం పైన నిరసనలకు సిద్దం అవుతున్నారు. అదే సమయం లో ఎమ్మెల్యేలు.. ఎంపీలతో రాజీనామాల అంశం పైన ఆలోచన చేస్తున్నారు. మెడికల్ కాలేజీల అంశం పైన నిరసన దీక్షలో తానే పాల్గొనాలని నిర్ణయించారు.
జగన్ పోరుబాట
మాజీ సీఎం జగన్ తిరిగి రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానాన్ని మాజీ సీఎం జగన్ వ్యతిరేకిస్తున్నారు. తమ హయాంలో 16 మెడికల్ కాలేజీలకు అనుమతి తెచ్చమని.. ఆరు కాలేజీ లను వివిధ దశల్లో పూర్తి చేసామని గుర్తు చేస్తున్నారు. మెడికల్ కాలేజీలను ప్రయివేటు పరం చేసే ఆలోచనలను తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు టెండర్లు పిలిచి.. ఎవరికి అప్పగించినా తామ అధికారంలోకి వచ్చిన తరువాత తిరిగి తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ప్రభుత్వం మాత్రం మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేయటం లేదని.. పీపీపీ విధానంలో 2028 నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేస్తోంది.

రాజీనామాల పైనా
కాగా, ప్రభుత్వం నాలుగు మెడికల్ కాలేజీల నిర్వహణ పైన నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో.. ఇప్పుడు జగన్ ఈ అంశం పైన పోరాటానికి సిద్దం అవుతున్నారు. అటు అసెంబ్లీకి ఎమ్మెల్యేలు హాజరు కాకపోవటం తో అనర్హత అంశం పైన అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల విషయం లోనూ జగన్ సీరియస్ గా ఉన్నారు. అనర్హత వేటుకు సిద్దం అయితే.. ఎమ్మెల్యేలతో పాటుగా ఎంపీ లతోనూ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు. ఈ నెల 24 జరిగే పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ అంశం పైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రాజీనామాలు చివరి అస్త్రంగా ఉండాలని.. ఇప్పుడు మెడికల్ కాలేజీల వ్యవహారంలో రాష్ట్ర స్థాయిలో నిరసనలు తీవ్రతం చేయాలని పార్టీ ముఖ్య నేతలు అభిప్రాయ పడుతున్నారు.
జగన్ దీక్ష
దీంతో.. జగన్ ఈ సమావేశంలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మెడికల్ కాలేజీల విషయంలో దసరా తరువాత రాష్ట్ర స్థాయి నిరసన దీక్ష కు జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. నంద్యాల లేదా విజయవాడ కేంద్రంగా నిరహార దీక్ష చేయాలని జగన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వరుస నిరసనల తరువాత ప్రభుత్వ ఆలోచన మారకుంటే రాజీనామాలు చేయాలని జగన్ ప్లాన్ గా పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో.. ఈ నెల 24న జరిగే సమావేశంలో జగన్ ఈ అంశం పైన పోరు బాట... దీక్ష.. భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు. ఎన్నికల్లో ఓడిన తరువాత జగన్ తొలి నిరసన పోరులో స్వయంగా పాల్గొనాలని నిర్ణయించటంతో... ఇప్పుడు ఈ వ్యవహారం ద్వారా ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications