జాగ్రత్త.. జగన్కు పారనోయ వ్యాధి, ఢిల్లీలో ఉంటే ప్రధానిని అనేవారు: దేవినేని
ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిన్న (గురువారం) ఢిల్లీలో ఉంటే తానే ప్రధానమంత్రిని అనేవాడేమోనని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు శుక్రవారం అన్నారు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిన్న (గురువారం) ఢిల్లీలో ఉంటే తానే ప్రధానమంత్రిని అనేవాడేమోనని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు శుక్రవారం అన్నారు.
జగన్ పారనోయ వ్యాధితో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ వ్యాధి ఉన్న వారు తమను తాము చాలా ఎత్తులో ఊహించుకుంటారని చెప్పారు. జగన్కు కూడా ఈ వ్యాధి ఉందని, ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

జగన్ను నిర్బంధించడం అనాగరిక చర్య ఆళ్ల నాని
ఏపీకి ప్రత్యేక హోదా కోసం విశాఖలో చేపట్టిన సదస్సుకు వెళ్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ను రెండు గంటల పాటు విమానాశ్రయంలో నిర్బంధించడం అనాగరిక చర్య అని ఆ పార్టీ నేత ఆళ్ల నాని మండిపడ్డారు.
టిడిపి నేతలు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకోవడం సరికాదన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి ప్రభుత్వం మద్దతు ఇవ్వనవసరం లేదని, కనీసం అడ్డు రాకుంటే చాలని చెప్పారు. ఈ నెల 29న ద్వారకా తిరుమలలో జగన్ పర్యటిస్తారని, సాయంత్రం నాలుగు గంటలకు సభ ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications