Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్లకార్డులతో జగన్ నిరసన, కీలక డిమాండ్ - హెచ్చరిక..!! (వీడియో)

మాజీ సీఎం జగన్ నిరసనకు దిగారు. ప్లకార్డులు చేత బట్టి అసెంబ్లీ వద్ద ప్రభుత్వ వ్యతిరేక నిరసన లో పాల్గొన్నారు. పార్టీ ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వచ్చారు. సభలో ప్రతిపక్ష పార్టీ గా మాట్లాడే అవకాశం ఇవ్వరు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడరు అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. గవర్నర్ ప్రసంగం వేళ సభలో వైసీపీ సభ్యులు పోడియం చుట్టు ముట్టారు. శాంతి భద్రతలు కాపాడాలంటూ నినాదాలు చేసారు. గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలోనే వాకౌట్ చేసారు. పార్టీ నేతలతో జగన్ సమావేశం అయ్యారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తొలి రోజు సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరయ్యారు. అసెంబ్లీ పరిసరాల్లో సహచర సభ్యులతో కలిసి మాజీ సీఎం జగన్ నిరసనగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. చేతిలో ప్లకార్డులతో జగన్ సభ వరకు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేసారు.

YS Jagan participated in protest rally with Party leaders Against Govt decisions walk out from Assembly

శాంతి భద్రతలు కాపాడాలని... మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ ఆపాలని... ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేసారు. లడ్డూ పై అసత్య ప్రచారం అంటూ స్లోగన్స్ ఇచ్చారు. పోడియం ను వైసీపీ సభ్యులు చుట్టు ముట్టటంతో మార్షల్స్ సభలోకి వచ్చారు. కాసేపటికి వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే సభ నుంచి వాకౌట్ చేసారు. తరువాత పార్టీ సభ్యులతో జగన్ సమావేశమయ్యారు.

కాగా, తమ పార్టీ నేతల ఇళ్ల పైన దాడులు జరుగుతున్న అంశాన్ని జగన్ ప్రస్తావించారు. ఇదే తరహాలో కొనసాగితే సహించేది లేదని హెచ్చరించారు. కాగా.. సభకు వెళ్లే ఎమ్మెల్యేలు వెళ్లవచ్చని జగన్ సూచించినట్లు సమాచారం. అదే విధంగా మండలిలో మాత్రం పార్టీ ఎమ్మెల్సీలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, పార్టీ నేతల ఇళ్ల పై దాడులు, ఆర్దిక పరిస్థితి పైన ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్దేశించారు. కాగా.. గవర్నర్ ప్రసంగం అయిన తరువాత బీఏసీ సమావేశం కానుంది. ఎన్ని రోజులు సభ నిర్వహించాలి .. అజెండా ఖరారు చేయనుంది.

YS Jagan participated in protest rally with Party leaders Against Govt decisions walk out from Assembly

బీఏసీకి వైసీపీ దూరంగా ఉండే అవకాశం ఉంది. అయితే, దాదాపు 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. లడ్డూ వివాదం, మెడికల్ కాలేజీల గురించి సభ లో చర్చించి.. ప్రజలకు వివరించాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. కాగా, సమావేశాలు సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉండటంతో... పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో జగన్ తీసుకునే నిర్ణయం పైన ఆసక్తి నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+