అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!!
అమరావతి పై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. అమరావతి సహా ఏ ప్రాంతానికి వైసీపీ వ్యతిరేకం కాదని జగన్ స్పష్టం చేసారు. పార్లమెంట్ లో అమరావతి ఏపీ రాజధాని గా చట్టబద్దత కల్పిస్తున్న వేళ జగన్ స్పందించారు. అసలు రాజ్యాంగంలో రాష్ట్రాలకు రాజధాని అని ఉందా అని ప్రశ్నించారు. రాజధాని పై తీర్మానం అవసరం లేదని మంత్రి పార్ధసారధి చెప్పారని గుర్తు చేసారు. రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం అంటూ కేంద్రం హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ ను ప్రస్తావించారు. చట్టాలు గురించి మాట్లాడే వ్యక్తి... చట్ట సవరణ గురించి మాట్లాడారా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
రాష్ట్రంలో ఏ ప్రాంతాన్ని వైసీపీ వ్యతిరేకిందచని జగన్ స్ఫష్టం చేసారు. అమరావతి చట్ట బద్దత పైన పార్లమెంట్ లో బిల్లు పెట్టే వేళ మాజీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 2014 నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు రాజధానిలో ఏం చేసారని ప్రశ్నించారు. కేంద్రం సాక్షాత్తు రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం అంటూ అధికారికంగా ఏపీ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసారని గుర్తు చేసారు. ఏపీ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ లో కేంద్రం పాత్ర లేదని పేర్కొన్నారు. జార్ఖండ్, ఉత్తరాఖండ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు రాజధానులు కేంద్రం డిసైడ్ చేసిందా అని ప్రశ్నించారు.

అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా చెప్పారని.. సేకరిస్తున్న భారీ రుణాలు ఏం చేస్తున్నారని నిలదీసారు. భూములు ఇచ్చిన రైతుల హామీలు అమలు చేసారా అంటూ ప్రశ్నించారు. తొలుత తీసుకున్న 50 వేల ఎకరాల్లోనే రోడ్లు, కరెంట్, డ్రైనేజ్, వాటర్ వీటి కోసం అవసరం అయ్యే ఖర్చు చంద్రబాబు లెక్కల ప్రకారమే ఎకరాకు రూ 2 కోట్లు అవసరమని చెప్పారుబ50 వేల ఎకరాలకు లక్ష కోట్లకు దిక్కు లేదనుకుంటే.. ఇప్పుడు మరో 50 వేల ఎకరాలకు అదనం గా అయ్యే ఖర్చు మరో లక్ష కోట్లు అవుతుందని లెక్కలు చెప్పారు.
లక్ష ఎకరాల కోసం రూ 2 లక్షలు కావాలి.. ఎలా సాధ్యం
అమరావతికి ఈ నిధులు ఎక్కడ నుంచి వస్తాయి.. మాస్టర్ ప్లాన్ ఎందుకు మారుస్తున్నారని జగన్ ప్రనశ్నించారు. మున్సిపాల్టీగా మిలిగిపోతుందని ఎందుకు అంటున్నారని నిలదీసారు. అడుగు కోసం చేస్తున్న ఖర్చు 12 వేల వరకు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అసలు అమరావతిలో చంద్రబాబు అండ్ టీం ఉంటుందా అని ప్రశ్నించారు. అమరావతి పై తీర్మానం గురించి మండలి లో ఎందుకు చర్చ చేయలేదని జగన్ నిలదీసారు. అమరావతి సహా ఏ ప్రాంతానికి వైసీపీ వ్యతిరేకం కాదని జగన్ తేల్చి చెప్పారు. అయితే.. అన్ని విషయాలు ఓపెన్ గా చర్చించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసారు. మౌలిక వసతుల కల్పన.. ఖర్చు గురించి ఆలోచన చేయాలని సూచించారు.
LIVE: Former Chief Minister, YSRCP Chief Sri @YSJagan Press Meet #YSJaganPressMeet https://t.co/RpUE85YjiT
— YSR Congress Party (@YSRCParty) April 1, 2026
లక్ష ఎకరాలు సమీకరిస్తూ మౌలిక వసతుల కోసం 12 ఏళ్ల క్రితం వేసిన అంచనా మేరకరు రూ 2 లక్షల కోట్లు కావాలి.. ఇప్పుడున్న అంచనాలు పెరుగుతాయి. ఎక్కడ నుంచి తీసుకొస్తారో ఈ నిధులు అనేది సమస్య. ఇప్పటి వరకు ఎంత పెట్టారు.. రైతులకు ఇచ్చిన హామీలు ఏం చేసారనేది లెక్కలు వివరించారు. 2014-19 వరకు చంద్రబాబు అమరావతి పై రూ 5,335 కోట్లు ఖర్చు చేసారని చెప్పారు. అప్పు చేసి ఖర్చు చేసారన్నారు. 2024 నుంచి ఈ రెండేళ్ల కాలంలో అమరావతి కోసం రూ 47 వేల కోట్లు అప్పు చేసి.. అందులో రూ 13 వేల కోట్లు డ్రా చేసారని చెప్పుకొచ్చారు. ఇందులో మొబలైజేషన్ అడ్వాన్సుల కింద భారీగా నిధులు ఇచ్చారని విమర్శించారు.
-
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
భారీ వర్షాలు, పిడుగులు, ఈదురు గాలులు - బీ అలర్ట్.. ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
ఏపీ రాజధానిని మళ్లీ మార్చుకోవచ్చా ? అమరావతి గెజిట్ కూడా సరిపోదా ? -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!













Click it and Unblock the Notifications