YS Jagan Bandage: వైఎస్ జగన్ తలకు బ్యాండేజ్ తొలగింపు..!
ఏపీలో సీఎం జగన్ పై విజయవాడలో రాయిదాడి జరిగి రెండు వారాలవుతోంది. రాయి దాడి జరగగానే ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు ఆయన తలకు బ్యాండేజ్ కట్టారు. దీంతో గత కొన్ని రోజులుగా ఈ బ్యాండేజ్ తోనే ఆయన మేమంతా సిద్ధం రోడ్ షోలు, సభల్లోనూ పాల్గొన్నారు. దెబ్బ తగిలి రెండు వారాలవుతున్నా ఈ బ్యాండేజ్ కొనసాగింపుపై విపక్షాలు సెటైర్లు వేస్తూ వచ్చాయి. అయితే ఇవాళ వైసీపీ మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ బ్యాండేజ్ తీసేసి కనిపిస్తున్నారు.
సీఎం జగన్ కు రాయి దాడి గాయం కాగానే బ్యాండేజ్ వేసిన డాక్టర్లు ఆ తర్వాత దాన్ని తీయకుండా అలాగే కొనసాగించారు. దీంతో ఓ దశలో జగన్ సోదరి డాక్టర్ సునీతారెడ్డి సైతం ఆ బ్యాండేజ్ తీసేయాలని సూచించారు. ఇన్ని రోజులు బ్యాండేజ్ ఉంచుకుంటే సెప్టిక్ అవుతుందని గుర్తుచేశారు. దీనిపైనా జగన్ వెంటనే స్పందించలేదు. కానీ ఇవాళ ఏమనుకున్నారో ఏమో కానీ బ్యాండేజ్ తీసేసి దర్శనమిచ్చారు.

ఈ మధ్యలో విపక్షాలు రాయిదాడితో పాటు బ్యాండేజ్ పైనా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కొనసాగించాయి. దీనికి వైసీపీ నేతలు కూడా కౌంటర్లు ఇవ్వాల్సి వచ్చింది. తాజాగా డాక్టర్ సునీతారెడ్డి చేసిన సూచనపైనా వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. జగన్ కు బ్యాండేజ్ ఎప్పుడు తీయాలో తెలుసంటూ కౌంటర్ ఇచ్చారు. ఇలా జగన్ బ్యాండేజ్ ఎన్నికల వేళ రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications