Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ys Jagan Stone Attack: రాయి దాడిపై జగన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!

ఏపీలో మేమంతా సిద్దం పేరుతో ఎన్నికల ప్రచార యాత్ర చేస్తున్న తనపై విజయవాడలో జరిగిన రాయి దాడిపై సీఎం జగన్ తొలిసారి స్పందించారు. ఇవాళ ఉదయం కేసరపల్లి క్యాంపు సైట్ లో తనను కలిసేందుకు వచ్చిన వైసీపీ నేతలతో జగన్ మాట్లాడారు. బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసే దాడులు చేస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రాణాపాయం తప్పిందన్నారు.

మరోసారి అధికారంలోకి వస్తున్నామని, ఎలాంటి ఆందోళన వద్దని పార్టీ నేతలకు సీఎం జగన్ సూచించారు. ఎలాంటి దాడులు తనను ఆపలేవని, ధైర్యంతో ముందడుగు వేద్దామని నేతలతో అన్నారు. దేవుడు దయ, ప్రజల ఆశీర్వాదం తనతో ఉన్నాయని నాయకులతో జగన్ అన్నారు. ధైర్యంగా అడుగులు ముందుకేద్దామన్నారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరంలేదున్నారు.
దీంతో నేతలు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు.

Ys Jagan s first reaction on stone attack on him

సీఎం వైఎస్ జగన్ బస్సుయాత్రలో భాగంగా ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సంబంధిత నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలను కలుస్తారు. ఇవాళ ఈ కార్యక్రమానికి కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలే కాకుండా రాష్ట్రం నలుమూలనుంచి పలువురు నాయకులు తరలివచ్చారు. వీరితో జగన్ పిచ్చాపాటీ మాట్లాడారు. తనపై రాయి దాడి తర్వాత తొలిసారి జగన్ చేసిన వ్యాఖ్యలతో నేతలు కూడా సంతోషం వ్యక్తం చేశారు. వాస్తవానికి సీఎం జగన్ ఇవాళ సాయంత్రం గుడివాడలో జరిగే సభలో రాయి దాడిపై స్పందించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+