Ys Jagan Stone Attack: రాయి దాడిపై జగన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
ఏపీలో మేమంతా సిద్దం పేరుతో ఎన్నికల ప్రచార యాత్ర చేస్తున్న తనపై విజయవాడలో జరిగిన రాయి దాడిపై సీఎం జగన్ తొలిసారి స్పందించారు. ఇవాళ ఉదయం కేసరపల్లి క్యాంపు సైట్ లో తనను కలిసేందుకు వచ్చిన వైసీపీ నేతలతో జగన్ మాట్లాడారు. బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసే దాడులు చేస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రాణాపాయం తప్పిందన్నారు.
మరోసారి అధికారంలోకి వస్తున్నామని, ఎలాంటి ఆందోళన వద్దని పార్టీ నేతలకు సీఎం జగన్ సూచించారు. ఎలాంటి దాడులు తనను ఆపలేవని, ధైర్యంతో ముందడుగు వేద్దామని నేతలతో అన్నారు. దేవుడు దయ, ప్రజల ఆశీర్వాదం తనతో ఉన్నాయని నాయకులతో జగన్ అన్నారు. ధైర్యంగా అడుగులు ముందుకేద్దామన్నారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరంలేదున్నారు.
దీంతో నేతలు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు.

సీఎం వైఎస్ జగన్ బస్సుయాత్రలో భాగంగా ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సంబంధిత నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలను కలుస్తారు. ఇవాళ ఈ కార్యక్రమానికి కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలే కాకుండా రాష్ట్రం నలుమూలనుంచి పలువురు నాయకులు తరలివచ్చారు. వీరితో జగన్ పిచ్చాపాటీ మాట్లాడారు. తనపై రాయి దాడి తర్వాత తొలిసారి జగన్ చేసిన వ్యాఖ్యలతో నేతలు కూడా సంతోషం వ్యక్తం చేశారు. వాస్తవానికి సీఎం జగన్ ఇవాళ సాయంత్రం గుడివాడలో జరిగే సభలో రాయి దాడిపై స్పందించనున్నారు.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!












Click it and Unblock the Notifications