లోపల విభజన, పైకి సమైక్యం: కిరణ్పై విజయమ్మ
కిరణ్ కుమార్ రెడ్డి రూట్మ్యాప్లు ఇచ్చారని, మోసపూరితమైన ధోరణితో సమ్మెను విరమింపజేశారని, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టిద్దామన్నా వాటిని ఆపేశారని ఆమె అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం శానససభలో తీర్మానం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సమైక్య తీర్మానం పార్లమెంటులో, న్యాయస్థానాల్లో ఓ ఆయుధంలా పనిచేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇప్పటికైనా సమైక్య రాష్ట్రం కోసం కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ముందుకు రావాలని ఆమె కోరారు. లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆమె అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ చగన్ పలు రాష్ట్రాలకు వెళ్లి వివిధ పార్టీల నేతలకు ఆర్టికల్ 3, 371డి గురించి వివరించి వారి మద్దతు కూడగట్టారని, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని దేశవ్యాప్తంగా తెలియజేయగలిగారని విజయమ్మ అన్నారు.
తమకు మద్దతు ఇస్తున్న కాంగ్రెసు సభ్యులపై వేటు వేయడం వల్ల సమైక్యాంధ్రకు మద్దతు తగ్గిందని ఆమె అన్నారు. సీమాంధ్రకు చెందిన శాసనసభ్యులు 175 మంది ఉంటే 15మందిపై వేటు వేశారని ఆమె చెప్పారు. చంద్రబాబు కూడా కిరణ్ కుమార్ రెడ్డి మాదిరిగానే విభజనకు అడుగడుగునా సహకరిస్తున్నారని విజయమ్మ విమర్శించారు.