వివేకా కేసు దోషులకు మరణశిక్ష ? సుప్రీంలో కుమార్తె, అల్లుడికి ఊరట..!
ఏపీలో ఆరేళ్ల క్రితం తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో నిందితులకు గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు.. ఈ కేసులో దర్యాప్తు ముగిసిందా లేదా అని సీబీఐని అడిగింది. దీంతో ముగిసినట్లు సీబీఐ జవాబిచ్చింది. అనంతరం ఇవాళ వాదనలు జరిగాయి.
ఈ సందర్భంగా గతంలో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఎస్పీ రాంసింగ్, వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై అప్పటి జగన్ సర్కార్ నమోదు చేసిన కేసుల ప్రస్తావన వచ్చింది. ఈ కేసులో కుట్ర పూరితంగా మృతుడి కూతురు, అల్లుడితో పాటు సీబీఐ అధికారిపైనా కేసులు నమోదు చేసినట్లు సునీత లాయర్ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో స్పందించిన జస్టిస్ సుందరేశన్ ధర్మాసనం ఈ కేసుల్ని కొట్టేస్తామని ప్రకటించింది. దీంతో ఈ ముగ్గురికీ ఊరట లభించింది.

మరోవైపు వివేకా హత్య కేసులో నిందితులు జైల్లోనే ఉండటంపై సీబీఐ లాయర్ గా హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు .. ఈ హత్య కేసు చాలా తీవ్రమైనదని, హత్య చేసి గుండెపోటు అని ప్రచారం చేశారని, ఆ తర్వాత రక్తపు వాంతులు చేసుకున్నట్లు కూడా ప్రచారం చేశారన్నారు. చివరికి హత్య ఆధారాలు చెరిపేశారని నిందితుల గురించి సుప్రీంకు వివరించారు. ఈ కేసులో వీరికి మరణశిక్ష విధించే అవకాశం ఉందని సీబీఐ లాయర్ సుప్రీంకోర్టుకు తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

మరోవైపు ఈ కేసులో దర్యాప్తు పూర్తయినట్లు సుప్రీంకోర్టుకు సీబీఐ చెప్పడంపై సునీత తరఫు న్యాయవాది సిద్ధార్ధ లూత్రా అభ్యంతరం తెలిపారు. సుప్రీంకోర్టు దర్యాప్తుకు గడువు విధించడం వల్లే సీబీఐ ఇలా దర్యాప్తు ముగించేసినట్లు చెబుతోందన్నారు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు అవసరమని భావిస్తున్నట్లు తెలిపారు. గతంలో సీబీఐ ఈ కేసులో దర్యాప్తు ముగిసిందని, సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఆదేశిస్తే అదనంగా దర్యాప్తు కొనసాగిస్తామని తెలిపింది. దీనిపైనా సుప్రీం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications