వైసిపిలోనే ఉంటాం: అగ్నిసాక్షిగా ఎమ్మెల్యేల ప్రమాణం

దీంతో గురువారం జిల్లా పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి పార్టీని వీడేది లేదంటూ అగ్నిసాక్షిగా ప్రమాణం చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఎదుట వెలిగించిన జ్యోతిపై ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు ప్రమాణం చేశారు.
ఇదిలావుంటే, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఖమ్మం జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం తమ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. ఆయనతోపాటు టిడిపి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం జడ్పీ చైర్పర్సన్, 18 మంది జడ్పీటీసీ సభ్యులు, 18 మంది ఎంపీపీలు, టీడీపీ జిల్లా అధ్యక్షుడుసహా 25 మంది మండల పార్టీ అధ్యక్షులు కూడా ఈ సందర్భంగా గులాబీ కండువాలు కప్పుకుంటారని చెప్పారు.
అలాగే టీడీపీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఖమ్మం జిల్లా నాయకుడు రాంబాబు, కోదాడ మాజీ ఎమ్మెల్యే వి.చందర్రావు, ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా పార్టీలో చేరుతారని తెలిపారు. తెరాస అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో శుక్రవారం సాయంత్రం 4-5 గంటల మధ్య ఉంటుందని చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications